News March 13, 2025
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

మధ్యప్రదేశ్ ధార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బద్నావర్-ఉజ్జయిని హైవేపై గ్యాస్ ట్యాంకర్ అదుపు తప్పి కారు, పికప్ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Similar News
News April 2, 2026
రేపటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన!

AP: రాష్ట్రంలోని గ్రామాల్లో సర్పంచ్ల పదవీకాలం నేటితో ముగియనుంది. దీంతో రేపటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన అమల్లోకి రానుంది. ఈ మేరకు కూటమి ప్రభుత్వం 20రోజుల కిందటే ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పదవీ కాలం మొన్నటితో ముగిసింది. దీంతో కొత్త SEC వచ్చిన తర్వాతే స్థానిక ఎన్నికలపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
News April 2, 2026
KKRvsSRH: ఓటమి కసితో బరిలోకి!

IPL: కోల్కతా వేదికగా ఇవాళ KKR, SRH మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్లో ఆడిన తొలి మ్యాచుల్లో ఇరుజట్లు ఓటమి చెందాయి. దీంతో ఇవాళ గెలిచి బోణీ కొట్టాలని కసితో ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ రెండు టీమ్లు 30 సార్లు తలపడగా KKR 20 సార్లు విజయం సాధించింది. కోల్కతాలో అయితే 11 సార్లు పోటీపడగా 8 గెలుపులతో KKRదే పైచేయిగా ఉంది. బ్యాటింగ్లో ఇరుజట్లు బలంగానే ఉన్నా బౌలింగ్ విభాగంలో కాస్త బలహీనత కన్పిస్తోంది.
News April 2, 2026
ఇలాంటి కొడుకు బతికున్నా ప్రయోజనం లేదు!

తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా?
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: తల్లిదండ్రుల మీద దయ, ప్రేమలేని కుమారుడు పుట్టినా, చచ్చినా ఒక్కటే. ఎవరికీ ఉపయోగం ఉండదు. పుట్టలో చెదలు నిరంతరం పుడుతూ, చస్తూ ఉంటాయి. వాటిని ఎవరూ పట్టించుకోరు. తల్లిదండ్రులకు సేవ చేయని కొడుకు కూడా ఆ చెదలతో సమానమే. <<-se>>#PADHYAM<<>>


