News March 14, 2025
పబ్లిక్ ఇష్యూకు LG ఇండియా: Rs15000CR

రూ.15000 కోట్ల విలువతో IPOకు వచ్చేందుకు సెబీ వద్ద LG ఎలక్ట్రానిక్స్ ఇండియా అనుమతి తీసుకుంది. ఇదే జరిగితే హ్యుందాయ్ తర్వాత NSE, BSEల్లో నమోదైన సౌత్ కొరియా రెండో కంపెనీగా అవతరిస్తుంది. 15%కి సమానమైన 10.18 కోట్ల షేర్లను OFS పద్ధతిన కేటాయించనుంది. అంటే ఈ పెట్టుబడి నేరుగా LG ఇండియాకు కాకుండా ప్రధాన కంపెనీకి వెళ్తుంది. 2024, MAR 31తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.64,087 కోట్ల ఆదాయం ఆర్జించింది.
Similar News
News December 28, 2025
బంగ్లా ‘యాంటీ ఇండియా’ మంత్రం

బంగ్లాదేశ్లో ర్యాడికల్ స్టూడెంట్ లీడర్ హాదీ హత్యను అక్కడి ఇస్లామిస్ట్ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయి. నిరసనలతో దేశాన్ని స్తంభింపజేస్తున్నాయి. భారత్, ప్రధాని మోదీ వ్యతిరేక నినాదాలు చేస్తున్నాయి. ప్రస్తుతం ‘భారత వ్యతిరేక’ ధోరణి అక్కడ బలమైన శక్తిగా మారిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎన్నికల్లో గెలవాలనుకునే ఏ పార్టీ అయినా ఈ భావోద్వేగాలను విస్మరించలేని పరిస్థితి.
News December 28, 2025
వన్డేల్లోకి ఇషాన్ కిషన్ రీఎంట్రీ?

SMATలో సత్తా చాటిన ఇషాన్ కిషన్ రెండేళ్ల తర్వాత తిరిగి వన్డేల్లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. JAN 11 నుంచి న్యూజిలాండ్తో జరిగే వన్డే సిరీస్కు ఆయనను ఎంపిక చేసే అవకాశం ఉందని క్రీడా వర్గాలు వెల్లడించాయి. కిషన్ తన చివరి వన్డే 2023 అక్టోబర్లో అఫ్గానిస్థాన్తో ఆడారు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్లలో ఆయన ఒకరు. అటు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న టీ20 WCకు కిషన్ ఎంపికైన సంగతి తెలిసిందే.
News December 28, 2025
‘మా డాడీ ఎవరో తెలుసా?’ అని చెప్పొద్దు.. సజ్జనార్ వార్నింగ్

TG: డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారు పలుకుబడిని ఉపయోగించాలని ప్రయత్నించవద్దని HYD సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ‘మా డాడీ ఎవరో తెలుసా?, మా అంకుల్ ఎవరో తెలుసా? అన్న ఎవరో తెలుసా? అని మా అధికారులను అడగొద్దు. మీ ప్రైవసీకి మర్యాద ఇస్తాం. వాహనం పక్కన పెట్టి, డేట్ వచ్చిన రోజు కోర్టులో పరిచయం చేసుకుందాం’ అని తనదైన స్టైల్లో వార్నింగ్ ఇచ్చారు. మద్యం తాగి వాహనం నడిపితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.


