News March 14, 2025
పబ్లిక్ ఇష్యూకు LG ఇండియా: Rs15000CR

రూ.15000 కోట్ల విలువతో IPOకు వచ్చేందుకు సెబీ వద్ద LG ఎలక్ట్రానిక్స్ ఇండియా అనుమతి తీసుకుంది. ఇదే జరిగితే హ్యుందాయ్ తర్వాత NSE, BSEల్లో నమోదైన సౌత్ కొరియా రెండో కంపెనీగా అవతరిస్తుంది. 15%కి సమానమైన 10.18 కోట్ల షేర్లను OFS పద్ధతిన కేటాయించనుంది. అంటే ఈ పెట్టుబడి నేరుగా LG ఇండియాకు కాకుండా ప్రధాన కంపెనీకి వెళ్తుంది. 2024, MAR 31తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.64,087 కోట్ల ఆదాయం ఆర్జించింది.
Similar News
News April 12, 2026
మార్నింగ్ నుంచి హుషారుగా ఉండాలంటే..

*నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల శరీరం ఉత్తేజమవుతుంది. జీర్ణ సమస్యలు తొలగుతాయి.
*రోజూ 20-30 ని.ల పాటు యోగా, వాకింగ్ చేయడం వల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
*పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం తీసుకుంటే శక్తి లభిస్తుంది. నూనె పదార్థాలకు దూరంగా ఉండాలి.
*ఎండలో కాసేపు గడపడం వల్ల విటమిన్ D అందుతుంది.
*పాజిటివ్గా ఆలోచించడం మొదలుపెట్టాలి.
News April 12, 2026
2 ఏళ్ల లోపు చిన్నారులకు దగ్గు మందు బ్యాన్!

2 ఏళ్ల లోపు పిల్లలకు దగ్గు సిరప్లను ప్రిస్క్రిప్షన్లో రాయకుండా నిషేధించాలని కేంద్రం భావిస్తోంది. ఐదేళ్ల పిల్లలకూ వాటి వాడకాన్ని తగ్గించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇండియన్ ఫార్మకోపియా కమిషన్ రిలీజ్ చేసిన నేషనల్ ఫార్ములరీ ఆఫ్ ఇండియా-2026 ముసాయిదాలో భాగంగా ఈ చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. గతేడాది దగ్గు మందు వల్ల పిల్లలు <<17944156>>చనిపోవడం<<>>, సిరప్లో హానికర రసాయనాలు ఉన్నట్లు తేలడం తెలిసిందే.
News April 12, 2026
చైనాకు ట్రంప్ వార్నింగ్

ఇరాన్కు చైనా ఆయుధాలు పంపే అవకాశం ఉందన్న అమెరికా <<19628773>>నిఘా వర్గాల<<>> హెచ్చరికలపై ట్రంప్ స్పందించారు. చైనా అలా చేస్తే పెద్ద సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మరోవైపు ఇరాన్తో చర్చల్లో విజయం తమదేనని అన్నారు. ‘చర్చల్లో ఒప్పందం కుదరొచ్చు, కుదరకపోవచ్చు. అదంతా పట్టించుకోను. గెలిచేది మనమే. నౌకలు మన దేశం వైపు బయల్దేరుతున్నాయి. భారీ ట్యాంకర్లలో చమురు, గ్యాస్ నింపుతున్నాం’ అని చెప్పారు.


