News March 15, 2025

నేటి నుంచి ఒంటిపూట బడులు.. మ.12.30 గంటల వరకే స్కూళ్లు

image

తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. తెలంగాణలో ఉ.8 గంటల నుంచి మ.12:30 గంటల వరకు క్లాసులు నిర్వహించాలని ఆదేశించారు. పదోతరగతి పరీక్షలు జరిగే స్కూళ్లలో మ.1:00 నుంచి సా.5:00 గంటల వరకు క్లాసులు జరగనున్నాయి. ఇక ఏపీలో ఉ.7:45 నుంచి మ.12:30 బడులు కొనసాగనున్నాయి. పదోతరగతి పరీక్ష కేంద్రాలున్న స్కూళ్లలో మ.1:15 నుంచి సా.5 గంటల వరకు తరగతులు ఉంటాయి.

Similar News

News September 14, 2025

నేటి నుంచి తిరుపతిలో మహిళా సాధికార సదస్సు

image

AP: తిరుపతిలో నేటి నుంచి 2రోజుల పాటు జాతీయ మహిళా సాధికార సదస్సు జరగనుంది. ప్రారంభోత్సవానికి CM చంద్రబాబు హాజరై ప్రసంగించనున్నారు. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాతో పాటు పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీల మహిళా సాధికార కమిటీల సభ్యులు పాల్గొననున్నారు. ముగింపు కార్యక్రమానికి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ హాజరుకానున్నారు. దేశ‌వ్యాప్తంగా 200 మందికి పైగా ప్రతినిధులు సదస్సుకు రానుండగా ఏర్పాట్లు పూర్తి చేశారు.

News September 14, 2025

దాయాదితో నేడే పోరు.. ఆసక్తి కరవు!

image

భారత్-పాక్ మ్యాచ్ అంటే క్రికెట్ ప్రపంచం మొత్తం అలర్ట్ అవుతుంది. టోర్నీ, వెన్యూ, ఫార్మాట్‌తో సంబంధంలేకుండా మ్యాచ్ కోసం కళ్లు కాయలు కాచేలా ఫ్యాన్స్ ఎదురు చూస్తారు. ఆసియా కప్‌లో ఇవాళ టీమ్ ఇండియా-పాక్ తలపడుతున్నా ఎక్కడా ఆ ఉత్కంఠ లేదు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత అంతా మారిపోయింది. దాయాది దేశంతో క్రికెట్ వద్దని అంతా వారిస్తున్నారు. బాయ్‌కాట్ ట్రెండ్ కూడా నడుస్తోంది. మరి మీరు ఇవాళ మ్యాచ్ చూస్తారా? COMMENT.

News September 14, 2025

రూ.81 వేల వరకు జీతం.. ఇవాళే లాస్ట్!

image

ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో 394 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఇవాళే చివరి తేదీ. ఇంజినీరింగ్ డిప్లొమా, డిగ్రీ చేసినవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. వయసు 18 నుంచి 27 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వేషన్‌ను బట్టి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన వారికి జీతం రూ.25,500 నుంచి రూ.81,100(అలవెన్సులు అదనం) వరకు ఉంటుంది. పూర్తి వివరాలకు www.mha.gov.in వెబ్‌సైటును సంప్రదించగలరు.