News March 15, 2025

నేటి నుంచి ఒంటిపూట బడులు.. మ.12.30 గంటల వరకే స్కూళ్లు

image

తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. తెలంగాణలో ఉ.8 గంటల నుంచి మ.12:30 గంటల వరకు క్లాసులు నిర్వహించాలని ఆదేశించారు. పదోతరగతి పరీక్షలు జరిగే స్కూళ్లలో మ.1:00 నుంచి సా.5:00 గంటల వరకు క్లాసులు జరగనున్నాయి. ఇక ఏపీలో ఉ.7:45 నుంచి మ.12:30 బడులు కొనసాగనున్నాయి. పదోతరగతి పరీక్ష కేంద్రాలున్న స్కూళ్లలో మ.1:15 నుంచి సా.5 గంటల వరకు తరగతులు ఉంటాయి.

Similar News

News July 7, 2025

గవాస్కర్ రికార్డును బద్దలు కొట్టిన గిల్

image

ఇంగ్లండ్‌పై భారత్ సాధించిన విజయంలో ఎక్కువ క్రెడిట్ గిల్‌కే ఇవ్వాలి. బ్యాటుతోనే కాకుండా.. కెప్టెన్‌గానూ అద్భుతం చేశారు. విదేశాల్లో అతిపిన్న వయసులో టెస్టు మ్యాచ్ గెలిచిన కెప్టెన్‌గా గవాస్కర్(26Y 198D) పేరిట ఉన్న రికార్డును గిల్(25Y 297D) బద్దలు కొట్టారు. బౌలర్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చి, వారికి నచ్చిన ఫీల్డ్ సెట్ చేసి సూపర్ విక్టరీ సాధించారు. కచ్చితంగా డ్రా చేస్తామన్న ఇంగ్లండ్‌‌కు ఓటమి రుచి చూపించారు.

News July 7, 2025

జులై 7: చరిత్రలో ఈరోజు

image

1896: భారత్‌లో తొలిసారిగా బొంబాయిలో చలనచిత్ర ప్రదర్శన
1900: స్వాతంత్ర్య సమరయోధుడు కళా వెంకటరావు జననం
1915: సినీ నటుడు మిక్కిలినేని జననం
1929: పోప్ కోసం వాటికన్ సిటీ ఏర్పాటు
1930: ‘Sherlock Holmes’ రచయిత ఆర్థర్ కోనన్ మరణం
1959: రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు జననం
1973: గాయకుడు కైలాశ్ ఖేర్ జననం
1981: భారత మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ జననం
*ప్రపంచ చాక్లెట్ దినోత్సవం

News July 7, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.