News March 15, 2025
SRH అభిమానులకు గుడ్ న్యూస్

సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి యోయో టెస్టు పాసయ్యారు. బెంగళూరులోని NCAలో నిర్వహించిన ఈ పరీక్షలో నితీశ్ 18.1 పాయింట్లు సాధించారు. దీంతో ఆయన రేపు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరతారు. కాగా ఈ ఏడాది జనవరిలో ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో ఆయన గాయపడ్డారు. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో పక్కటెముకల గాయానికి గురయ్యారు. అప్పటినుంచి ఎన్సీఏలో పునరావాసం పొందుతున్నారు.
Similar News
News March 15, 2025
క్రోమ్ యూజర్లకు అర్జెంట్ వార్నింగ్!

గూగుల్ క్రోమ్ బ్రౌజర్ను తక్షణమే అప్డేట్ చేసుకోవాలని యూజర్లకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. అందులో రెండు వల్నరబిలిటీస్ను గమనించామని CERT-In తెలిపింది. లేటెస్ట్ వెర్షన్కు అప్డేట్ అవ్వకపోతే రిమోట్ ఏరియాస్ నుంచి సైబర్ క్రిమినల్స్ అటాక్ చేసేందుకు అవకాశముందని తీవ్ర వార్నింగ్ ఇచ్చింది. ఒక ఆర్బిట్రారీ కోడ్ను పంపించి మోసగించొచ్చని, వ్యక్తిగత సమాచారం దొంగిలించొచ్చని వెల్లడించింది.
News March 15, 2025
గిరిజనేతర మహిళతో పెళ్లి.. మాజీ ఎంపీకి షాక్!

ఒడిశాలోని బీజేడీ నేత, మాజీ ఎంపీ ప్రదీప్ మాఝీకి షాక్ తగిలింది. గిరిజనేతర అగ్రకుల మహిళను ఆయన పెళ్లి చేసుకోవడాన్ని నేరంగా పరిగణించిన ఆయన తెగ ‘భటారా సమాజ్’ ప్రదీప్ను వెలివేస్తున్నట్లు ప్రకటించింది. తమ సమావేశంలో ఆ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. తెగ నిబంధనల్ని ఆయన ఉల్లంఘించారని, అందుకే వెలివేయాల్సి వస్తోందని వివరించింది. ప్రదీప్ 2009లో కాంగ్రెస్ ఎంపీగా గెలుపొందారు.
News March 15, 2025
ఆ బ్యాంకు డిపాజిటర్లు భయపడొద్దు: RBI

ఇండస్ఇండ్ బ్యాంకుపై వదంతులను RBI కొట్టిపారేసింది. ‘డిపాజిటర్లు వాటిని నమ్మొద్దు. భయపడాల్సిన అవసరం లేదు. బ్యాంకు ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంది. తగినంత మూలధనమూ ఉంది. ఇప్పటికే మా ఎక్స్టర్నల్ ఆడిట్ టీమ్తో కలిసి A/Cను బ్యాంకు సమగ్రంగా సమీక్షిస్తోంది’ అని తెలిపింది. బ్యాంకు డెరివేటివ్ పోర్టుఫోలియోలో Rs1580 CR అవకతవకలు జరగడం, మొత్తం నెట్వర్త్పై దాని ప్రభావం 2.35% ఉంటుందన్న వార్తలపై స్పందించింది.