News March 16, 2025
బాపట్ల జిల్లా TO DAY TOP HEADLINES

◆బాపట్ల ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు◆మార్టూరు: పదవ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం◆బాపట్ల: పరిసరాలను శుభ్రం చేసిన అడిషనల్ ఎస్పీ◆చీరాల: రైళ్లలో చోరీకి పాల్పడుతున్న దొంగ అరెస్టు◆బాపట్ల: ఇంటర్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన స్పెషలాఫీసర్◆వేమూరులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి◆పర్చూరు మండలాన్ని కమ్మేసిన పొగ మంచు◆రాజకీయ చరిత్రలో సీఎం చంద్రబాబు అరుదైన రికార్డు: ఎమ్మెల్యే ఏలూరి
Similar News
News July 9, 2025
పీయూ న్యాయ కళాశాలకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు

పాలమూరు యూనివర్సిటీలో ఉన్న న్యాయ కళాశాలకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ తెలిపింది. మూడేళ్లు ఎల్ఎల్బీ కోర్సులో 2025-26 విద్యా సంవత్సరంలో రెండు సెక్షన్లలో కలిపి 60 మంది విద్యార్థుల చొప్పున తీసుకోవచ్చునని అనుమతి ఇస్తూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు జారీ చేసినట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పూస రమేశ్ బాబు తెలిపారు.
News July 9, 2025
సిరిసిల్ల: కస్తుర్భా విద్యాలయాన్ని పరిశీలించిన కలెక్టర్

బోయినపల్లిలోని కస్తుర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఈరోజు పరిశీలించారు. పదో తరగతి గదిని సందర్శించి, విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. కిచెన్, స్టోర్ రూమ్, మధ్యాహ్న భోజనం తయారీ తీరును పరిశీలించారు. విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు, సదుపాయాలు కల్పించాలని సిబ్బందికి సూచించారు.
News July 9, 2025
పెద్దపల్లి: సమ్మె చేస్తుండగా కార్మికుడి మృతి

పెద్దపల్లి జిల్లా ధర్మారంలో బుధవారం జరిగిన కార్మికుల సమ్మెలో విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కార్మికులు ర్యాలీ చేపట్టిన అనంతరం వినతి పత్రం ఇచ్చేందుకు తహశీల్దార్ ఆఫీస్కు వెళ్లారు. అదే సమయంలో దొంగతుర్తికి చెందిన గ్రామ పంచాయతీ కార్మికుల సంఘం మండలాధ్యక్షుడు ఆకుల రాజయ్యకు గుండెపోటు వచ్చింది. తోటి కార్మికులు CPR చేసి అతడిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందారు.