News March 24, 2024
ఆ తరగతులకు కొత్త సిలబస్: CBSE

వచ్చే విద్యా సంవత్సరంలో(2024-25) 3, 6 తరగతులకు సిలబస్ మారనుందని సీబీఎస్ఈ వెల్లడించింది. మిగిలిన తరగతుల సిలబస్లో మార్పులు ఉండవని స్పష్టం చేసింది. కొత్త సిలబస్తో పాటు పాఠ్య పుస్తకాలను త్వరలో విడుదల చేస్తామని NCERT సమాచారమిచ్చినట్లు పేర్కొంది. ఆరో తరగతిలో అదనంగా బ్రిడ్జి కోర్సు ఉంటుందని, స్కూళ్లన్నీ కొత్త సిలబస్ను అనుసరించాలని సూచించింది.
Similar News
News September 15, 2025
నేటి ముఖ్యాంశాలు

* తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్: CBN
* జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక హైకమాండ్దే: రేవంత్
* హైదరాబాద్, గుంటూరులో వర్ష బీభత్సం
* YCP అవినీతిపాలనకు బాబు, మోదీ చరమగీతం: నడ్డా
* మహిళా శక్తి కారణంగానే భారత్కు గుర్తింపు: ఓంబిర్లా
* కాంగ్రెస్ వల్లే విద్యాసంస్థలు మూతపడే పరిస్థితి: హరీశ్ రావు
* తిరుపతిలో జాతీయ మహిళా సాధికారత సదస్సు ప్రారంభం
News September 15, 2025
మరోసారి ప్రతీకారం తీర్చుకున్నాం: నెటిజన్స్

ఆసియా కప్లో భాగంగా జరిగిన మ్యాచ్లో పాక్ను భారత్ చిత్తు చేసింది. మొదట పాక్తో మ్యాచ్ ఆడకూడదనే డిమాండ్ చేశారు. కానీ పోరు నుంచి తప్పుకోవడం కంటే పోరాడి మట్టి కరిపించడం మేలని అభిప్రాయపడిన వాళ్లూ ఉన్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి సమాధానంగా OP సిందూర్తో ఒకసారి, మైదానంలో ఇవాళ మరోసారి పాక్పై ప్రతీకారం తీర్చుకున్నామని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వేదిక ఏదైనా దాయాదికి బుద్ధి చెప్పాల్సిందే అంటున్నారు.
News September 15, 2025
BREAKING: పాకిస్థాన్పై భారత్ ఘన విజయం

ASIA CUP-2025: పాకిస్థాన్ను భారత్ చిత్తు చేసింది. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత పాకిస్థాన్ 127/9 పరుగులు చేసింది. అనంతరం భారత్ వేగంగా ఆడి 15.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (13 బంతుల్లో 31), సూర్యకుమార్ యాదవ్ 47*, తిలక్ వర్మ 31 రాణించారు. భారత్ తన తర్వాతి మ్యాచ్ ఈ నెల 19న ఒమన్తో ఆడనుంది.