News March 24, 2024
ఆ తరగతులకు కొత్త సిలబస్: CBSE

వచ్చే విద్యా సంవత్సరంలో(2024-25) 3, 6 తరగతులకు సిలబస్ మారనుందని సీబీఎస్ఈ వెల్లడించింది. మిగిలిన తరగతుల సిలబస్లో మార్పులు ఉండవని స్పష్టం చేసింది. కొత్త సిలబస్తో పాటు పాఠ్య పుస్తకాలను త్వరలో విడుదల చేస్తామని NCERT సమాచారమిచ్చినట్లు పేర్కొంది. ఆరో తరగతిలో అదనంగా బ్రిడ్జి కోర్సు ఉంటుందని, స్కూళ్లన్నీ కొత్త సిలబస్ను అనుసరించాలని సూచించింది.
Similar News
News December 12, 2025
డిఫెన్స్ లాబోరేటరీ, జోధ్పుర్లో ఇంటర్న్షిప్

DRDOకు చెందిన డిఫెన్స్ లాబోరేటరీ, జోధ్పుర్ 20 ఇంటర్న్షిప్ల కోసం దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 23 వరకు అప్లై చేసుకోవచ్చు. బీఈ/బీటెక్, ఎంటెక్, ఎంఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు అప్లై చేసుకోవచ్చు. నెలకు స్టైపెండ్ రూ.5వేలు చెల్లిస్తారు. అకడమిక్ ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తును స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలి. వెబ్సైట్: https://www.drdo.gov.in/
News December 12, 2025
ఉపాధి హామీ పథకం పేరు మార్చిన కేంద్రం

ఉపాధి హామీ పథకం పేరు మార్పునకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ‘పూజ్య బాపు గ్రామీణ ఉపాధి హామీ పథకం’గా పేరు మార్చింది. అదే విధంగా ఏడాదికి 120 రోజుల పని దినాలను తప్పనిసరి చేసింది. ఈ స్కీంకు రూ.లక్షా 51 వేల కోట్లు కేటాయించింది.
News December 12, 2025
వై నాట్ వైజాగ్.. అనేలా పరిశ్రమలకు ఆహ్వానం: లోకేశ్

AP: విశాఖ ప్రాంతానికి రానున్న కాలంలో 5 లక్షల ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తామని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ‘వై నాట్ వైజాగ్… అనేలా ఐటీ, ఇతర పరిశ్రమల్ని ఆహ్వానిస్తున్నాం. IT, GCC కేంద్రంగా VSP మారుతుంది. ఎకనామిక్ రీజియన్ కూడా ఈ ప్రాంత అభివృద్ధిని మారుస్తుంది. APకి వచ్చే ప్రతి ప్రాజెక్టును ప్రభుత్వానిదిగా భావించి చేయూత ఇస్తాం’ అని వివరించారు. ఆర్సెలార్ మిట్టల్, గూగుల్ ఇక్కడకు వస్తున్నాయన్నారు.


