News March 17, 2025

రేపు ఢిల్లీకి చంద్రబాబు

image

AP: అమరావతి పున: ప్రారంభ పనుల ఆరంభోత్సవానికి PM మోదీని ఆహ్వానించేందుకు CM చంద్రబాబు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. పీఎంతో ఆయన బుధవారం భేటీ కానున్నారు. ప్రపంచ బ్యాంకు నిధులు, అమరావతికి సాయం సహా వివిధ అంశాలపై ఆయన మోదీతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మల సహా పలువురు కేంద్రమంత్రులతో సమావేశమవుతారని సమాచారం.

Similar News

News March 17, 2025

మాతా వైష్ణోదేవీ కాంప్లెక్స్ వద్ద మద్యం తాగిన నటుడు

image

బాలీవుడ్ స్టార్ కిడ్స్ క్లోజ్ ఫ్రెండ్, ఇన్‌ఫ్లుయెన్సర్ ఒర్హాన్ అవత్రమణిపై JK పోలీసులు కేసు నమోదు చేశారు. మాతా వైష్ణోదేవీ యాత్రలో ఆయన మద్యం సేవించారు. నిషేధం ఉన్నా రష్యన్ సిటిజన్ అనస్టాలియా సహా మరో ఏడుగురితో కలిసి కాట్రాలోని హోటల్లో మద్యం తాగినట్టు రియాసీ పోలీసులు గుర్తించారు. BNSS 223 కింద FIR నమోదు చేశారు. Call Me Bae, MyFitness – Orry x Khali వంటి సిరీసులు, Nadaaniyan సినిమాలో ఆయన నటించారు.

News March 17, 2025

వయసు పెరిగినా స్ట్రాంగ్‌గానే ఉంటా: విజయశాంతి

image

వయసు పెరిగినా తాను స్ట్రాంగ్‌గానే ఉంటానని నటి విజయశాంతి అన్నారు. ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ టీజర్ రిలీజ్ ఈవెంట్లో ఆమె మాట్లాడారు. తన విషయంలో కళ్యాణ్ రామ్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పారు. ఈ సినిమాతో అభిమానులకు ఫుల్ మీల్స్ దొరుకుతుందన్నారు. తానే స్వయంగా ఫైట్ సీన్స్ చేసినట్లు పేర్కొన్నారు. అవి చూసి సెట్లో వారంతా షాక్ అయ్యారని తెలిపారు.

News March 17, 2025

క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పిన JIO

image

మరికొన్ని రోజుల్లో ఐపీఎల్- 2025 ప్రారంభం కానున్న వేళ క్రికెట్ అభిమానులకు జియో గుడ్ న్యూస్ చెప్పింది. ₹299 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌లలో ఎంపిక చేసిన వాటిని రీఛార్జ్ చేసుకుంటే 90 రోజుల పాటు ఉచితంగా జియో-హాట్‌స్టార్ మొబైల్/TV 4K సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చని తెలిపింది. అయితే, ఈరోజు నుంచి ఇది అందుబాటులోకి రానున్నట్లు పేర్కొంది. రీఛార్జ్ చేసుకునే సమయంలో ప్యాక్ వివరాలను చెక్ చేసుకోండి.

error: Content is protected !!