News March 18, 2025

SKLM: ఓటర్లు జాబితా తయారీకి చర్యలు తీసుకోవాలి

image

2కి.మీ కంటే ఎక్కువ దూరం ఉన్న ఓటర్లకు దగ్గరిలో ఉన్న పోలింగ్ కేంద్రానికి షిఫ్టింగ్ / మెర్జ్ చేయడానికి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ డివిజనల్ అధికారిణి సాయి ప్రత్యూష స్పష్టం చేశారు. మంగళవారం శ్రీకాకుళం తహశీల్దారు కార్యాలయంలో వివిధ పార్టీ నాయకులతో సమావేశం జరిగింది. ఓటర్లు జాబితా తయారీకి అన్ని రాజకీయ పార్టీల నుంచి సూచనలు అడిగి తెలుసుకున్నారు.

Similar News

News March 23, 2025

క్షయరహిత సమాజానికి కృషి చేస్తాం: డీఎంహెచ్ఓ

image

క్షయ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఎంహెచ్ఓ డా. బాలకృష్ణ పిలుపునిచ్చారు. సోమవారం ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించనున్న కార్యక్రమాలపై శనివారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. క్షయ అంటువ్యాధి అని, గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందని తెలిపారు. మైక్రో బ్యాక్టీరియా ట్యూబర్ క్లోసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా వ్యాది వ్యాప్తి చెందుతుందన్నారు.

News March 22, 2025

శ్రీకాకుళం: జాబ్ మేళా.. యువతకు ఉద్యోగాలు

image

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళా బలగ హాస్పిటల్ జంక్షన్‌లో ఉన్న పారిశ్రామిక శిక్షణ కేంద్రం (డీఎల్డీసీ-ఐటీఐ)లో ఈనెల 24 వ తేదీన జరగనుందని డీఎల్డీసీ అసిస్టెంట్ డైరెక్టర్ వై.రామ్మోహనరావు పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, తదితర అర్హత కలిగిన యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

News March 22, 2025

సంతబొమ్మాళి యువకుడికి రూ.1.3 కోట్ల కొలువు

image

సంతబొమ్మాళి మండలం ఉద్దండపాలెంకు చెందిన హనుమంతు సింహాచలంకు పోలాండ్ దేశంలో రూ.1.3 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగం లభించింది. విశాఖలో MHRM విద్య పూర్తిచేసిన యువకుడు పోలాండ్‌లో ఒక డైరీ సంస్థలో HR Assistant గా ఎంపికయ్యారు. ఈ మేరకు యువకుడిని గ్రామస్థులు, స్నేహితులు, బంధువులు అభినందించారు. యువకుడు తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తుంటారు.

error: Content is protected !!