News March 24, 2024
లక్నోపై రాజస్థాన్ గెలుపు

IPL2024లో రాజస్థాన్ రాయల్స్ బోణీ కొట్టింది. జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ను ఓడించింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20ఓవర్లలో 193 రన్స్ చేసింది. ఛేదనలో లక్నో 173/6కే పరిమితమైంది. రాజస్థాన్ కెప్టెన్ శాంసన్(82*) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి విజయంలో కీలకపాత్ర పోషించారు.
Similar News
News March 3, 2026
‘HANUMAN ప్రాజెక్ట్’ లక్ష్యం ఇదే..

AP: మానవులు, వన్యప్రాణుల మధ్య సంఘర్షణను నివారించడమే ‘HANUMAN ప్రాజెక్ట్’ ఉద్దేశమని Dy.CM పవన్ కళ్యాణ్ అన్నారు. మనుషులు, వ్యవసాయానికి నష్టం కలిగిస్తున్న వన్యప్రాణులను ఎలా హ్యాండిల్ చేయాలనే ఆలోచనతోనే దీన్ని ప్రారంభించామన్నారు. ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించడం, సరిహద్దు గ్రామాల ప్రజల ఉపాధిని కాపాడడమే ఈ ప్రాజెక్టు కర్తవ్యమన్నారు. సంఘర్షణ జరిగినప్పుడు వెంటనే స్పందించి ఉపశమన చర్యలను చేపడతామన్నారు.
News March 3, 2026
నువ్వు 9 నెలలు మోసి కన్న పిల్లలే కదమ్మా!

TG: బిడ్డ కడుపులో పడగానే తల్లి సంతోషం అంతాఇంతా కాదు. పుట్టాక బిడ్డను ఎన్నిసార్లు ముద్దాడుతుందో.. అందంగా అలంకరించి ఎంతగా మురిసిపోతుందో మాటల్లో వర్ణించలేని అనుభూతి. పిల్లలకు జ్వరమొస్తేనే తట్టుకోలేని తల్లి వారి ఊపిరినే ఆపడం గుండెలు పిండేసే విషాదం. భువనగిరి(D) గొల్లగూడెంలో 10 నెలల బాబు, పాప(2)ను చంపి తానూ తనువు చాలించిందో తల్లి. కుటుంబ కలహాలే కారణమని తెలుస్తున్నా పిల్లలను చంపడం కంటతడి పెట్టిస్తోంది.
News March 3, 2026
కప్పు కొట్టాలంటే ఈ లోపాలు సరిదిద్దుకోవాల్సిందే!

టీమ్ఇండియా సెమీస్కు చేరినప్పటికీ టైటిల్ గెలవడం అంత ఈజీ కాదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వరుణ్ ఫామ్ కోల్పోవడం, బౌలింగ్లో బుమ్రాపైనే ఆధారపడటం బలహీనతలుగా మారాయి. టోర్నీలో పేలవమైన క్యాచ్ల రికార్డ్ ఆందోళనకరం. బ్యాటింగ్లో టాప్ ఆర్డర్ విఫలమవుతుండటంతో ప్రతి మ్యాచ్లో ఎవరో ఒకరి వ్యక్తిగత మెరుపులపైనే టీమ్ ఆధారపడుతోంది. ఇంగ్లండ్తో పోరులో సమష్టిగా రాణించకపోతే కప్పు కలగానే మిగిలిపోతుంది!


