News March 24, 2024

ఢిల్లీ లిక్కర్ కేసు బోగస్: బీఆర్ఎస్

image

TG: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు బోగస్ అని బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పేరిట బీజేపీ రాజకీయ క్షుద్ర క్రీడను ఆడుతోందని దుయ్యబట్టింది. ప్రతిపక్షాలను, నాయకులను వేధించేందుకు బీజేపీ సర్కార్ చేసిన మాయోపాయమని పేర్కొంది. ఈ కేసులో అరెస్టైన పలువురు బీజేపీకి విరాళాలు ఇచ్చారని.. ఇదిగో సంచలన సాక్ష్యమని ఎలక్టోరల్ బాండ్ల వివరాలను షేర్ చేసింది.

Similar News

News October 3, 2024

భారత్‌లోనే ఖో ఖో తొలి వరల్డ్ కప్

image

మొట్టమొదటి ఖో ఖో వరల్డ్ కప్ వచ్చే ఏడాది భారత్‌లో జరగనుంది. ఇందులో 24 దేశాల నుంచి 16 పురుష, 16 మహిళల జట్లు పాల్గొననున్నాయి. ఖో ఖోకు భారత్ పుట్టినిల్లు అని, ఈ వరల్డ్ కప్ దాని ఔన్నత్యాన్ని, సంప్రదాయ వారసత్వాన్ని హైలైట్ చేస్తుందని ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (KKFI) తెలిపింది. 2032 నాటికి ఖో ఖోను ఒలింపిక్ స్పోర్ట్‌గా చూడటం తమ కల అని, అందుకు ఈ ప్రపంచకప్ దోహదం చేస్తుందని పేర్కొంది.

News October 3, 2024

పెరిగిన Gold Loans డామినేషన్

image

FY25 ఫస్ట్ క్వార్టర్లో NBFCలు పర్సనల్ లోన్లతో పోలిస్తే గోల్డ్ లోన్లనే ఎక్కువగా సాంక్షన్ చేశాయని FIDC తెలిపింది. ఇవి YoY 26% పెరిగి రూ.79,218 కోట్లకు చేరాయంది. గత ఏడాది రూ.63,495 కోట్లతో పర్సనల్ లోన్లే టాప్‌లో ఉన్నాయి. అన్ సెక్యూర్డ్ లోన్లపై RBI గత నవంబర్లో వార్నింగ్ ఇవ్వడంతో ఇప్పుడవి రెండో స్థానానికి చేరాయి. హౌసింగ్ లోన్స్, ప్రాపర్టీ లోన్స్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

News October 3, 2024

వారికి 2BHK ఇళ్లతో పాటు రూ.25వేలు

image

TG: హైదరాబాద్ మూసీ రివర్ బెడ్ నిర్వాసితులకు 2BHK ఇళ్లతో పాటు సామగ్రి తరలింపు, ఇతర ఖర్చుల కోసం రూ.25వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు HYD, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు తాజాగా ప్రకటన విడుదల చేశారు. ఒక్కో నిర్వాసిత కుటుంబానికి రూ.25వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే వారి సమస్యల పరిష్కారానికి ఆయా జిల్లాల్లో గ్రీవెన్ సెల్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.