News March 23, 2025
కేజీ చికెన్ ధర ఎంతంటే?

బర్డ్ఫ్లూ భయాన్ని వీడి ప్రజలు ఇప్పుడిప్పుడే చికెన్ తినడం మళ్లీ మొదలుపెడుతున్నారు. దీంతో ఏపీ, తెలంగాణలో కోడి మాంసం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రాంతాన్ని బట్టి కేజీ చికెన్ రూ.170 నుంచి రూ.220 వరకు పలుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో కేజీ రూ.160కి కూడా లభిస్తోంది. అయితే ఎండలు ముదరడంతో ఫారాల్లో కోళ్ల మరణాలు పెరుగుతున్నాయి. దీంతో రానున్న రోజుల్లో సప్లై తగ్గి చికెన్ ధర పెరిగే ఛాన్స్ ఉంది.
Similar News
News March 29, 2025
రోడ్ల మరమ్మతులకు రూ.600 కోట్లు

AP: రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం రూ.600 కోట్లు విడుదల చేసింది. ప్రాధాన్యతా క్రమంలో రాష్ట్ర, జిల్లా రోడ్లకు సంబంధించి 225 పనులు చేపట్టాలని రోడ్లు, భవనాల శాఖ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
News March 29, 2025
త్రిష ప్రేమ పెళ్లి చేసుకోనున్నారా?

41 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలతో అదరగొడుతున్న హీరోయిన్ త్రిష పెళ్లికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇవాళ ఆమె ఇన్స్టాలో నగలు, పట్టుచీరతో దిగిన ఫొటోను షేర్ చేస్తూ ‘ప్రేమ ఎప్పుడూ విజయం సాధిస్తుంది’ అని రాసుకొచ్చారు. దీనికి సఖి చిత్రంలోని ‘స్నేహితుడా’ పాట BGMను యాడ్ చేశారు. దీంతో ఆమె ఫ్రెండ్ను ప్రేమ వివాహం చేసుకుంటున్నారా? అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
News March 29, 2025
దేశ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి

దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. వసంతకాలంలో జరుపుకునే ఈ నూతన సంవత్సర పండుగ దేశంలోని సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుందని ముర్ము తెలిపారు. ఈ పర్వదినం సందర్భంగా ప్రజలంతా సామరస్యం, సమగ్రతను చాటి దేశ గౌరవాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని రాష్ట్రపతి కోరారు. ఉగాదిని వివిధ పేర్లతో దేశంలోని పలు రాష్ట్రాలు జరుపుకుంటాయి.