News March 23, 2025
BJP మెడలు వంచి తీరుతాం: కేటీఆర్

TG: బీజేపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో సీట్లు పెంచి, దక్షిణాదిలో తగ్గించే కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ మెడలు వంచైనా ఇక్కడ సీట్లు పెంచుకుంటామని చెప్పారు. ‘డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. సౌత్ స్టేట్స్ ఏం తప్పు చేశాయి? జనాభా నియంత్రణ పాటించినందుకా ఈ శిక్ష? దక్షిణాదికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోం’ అని ఆయన ఫైర్ అయ్యారు.
Similar News
News March 29, 2025
ధోనీ ముందే రావచ్చుగా.. ఫ్యాన్స్ ఆవేదన

నిన్న RCB చేతిలో CSK ఘోర పరాజయంపాలైన సంగతి తెలిసిందే. చెన్నై 6 వికెట్లు కోల్పోయి 28 బంతుల్లో 98 పరుగులు చేయాల్సిన సమయంలో ధోనీ బ్యాటింగ్కు వచ్చారు. 16 బంతుల్లో 30 పరుగులతో నాటౌట్గా నిలిచారు. సీఎస్కే బ్యాటర్లలో ఆయనదే అత్యధిక స్ట్రైక్ రేట్. ఇలా ఆడే సామర్థ్యం ఉన్న ఆయన జడేజా, అశ్విన్ కంటే ముందు వచ్చి ఉంటే మ్యాచ్ గెలిచేవాళ్లం కదా అంటూ సీఎస్కే ఫ్యాన్స్ నెట్టింట ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News March 29, 2025
రేపు, ఎల్లుండి ఆస్తి పన్ను వసూలు కౌంటర్లు ఓపెన్

AP: ఆస్తి పన్ను బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 50% వడ్డీ రాయితీ గడువు ఈనెల 31తో ముగియనుంది. 3 రోజులే అవకాశం ఉండడంతో ఈనెల 30, 31 తేదీల్లోనూ పన్ను వసూళ్ల కౌంటర్లు పనిచేసేలా మున్సిపల్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఉ.6 నుంచి రా.9 గంటల వరకు కౌంటర్ల వద్ద పన్ను చెల్లించవచ్చని అధికారులు తెలిపారు.
News March 29, 2025
BREAKING: మరో దేశంలో భూకంపం

మయన్మార్, బ్యాంకాక్ దేశాల్లో సంభవించిన భారీ భూకంపాన్ని మరువకముందే మరో దేశంలో భూమి కంపించింది. అఫ్గాన్లో 4.7 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ పేర్కొంది. ఇవాళ ఉ.5.16 గంటలకు భూమి కంపించినట్లు తెలిపింది. తీవ్రత తక్కువగా ఉండటంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగి ఉండకపోవచ్చని తెలుస్తోంది. అయితే వరుస భూకంపాలతో మయన్మార్, థాయ్లాండ్, భారత్, చైనా తదితర దేశాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.