News March 25, 2025

GHMC మేయర్ కనిపించడం లేదని ఫిర్యాదు

image

జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కనిపించడం లేదని మల్కాజిగిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. GHMC పరిధిలోని సమస్యలపై ఆమె శ్రద్ధ చూపడంలేదని కనీసం ఆమె కార్యాలయంలో కూడా అందుబాటులో ఉండటం లేదని శ్రవణ్ ఆరోపించారు. నగరంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ, మేయర్ వాటిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

Similar News

News March 29, 2025

రాష్ట్రంలో 10,954 ప్రభుత్వ ఉద్యోగాలు.. కీలక ప్రకటన

image

TG: రాష్ట్రంలో 10,954 గ్రామ పాలన ఆఫీసర్ (GPO) పోస్టుల భర్తీకి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. గతంలో VRO, VRAలుగా పని చేసిన వారి నుంచి ఆప్షన్లు స్వీకరించనుంది. ఇందుకోసం డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదంటే ఇంటర్ పూర్తి చేసి VRO/VRAగా కనీసం ఐదేళ్లు పని చేయాలి. వీరికి స్క్రీనింగ్ టెస్టు నిర్వహించి ఎంపిక చేస్తారు. విలేజ్ అకౌంట్స్ నిర్వహణ, సర్టిఫికెట్ల ఎంక్వైరీ లాంటి విధులు ఉంటాయి.

News March 29, 2025

‘ఆపరేషన్ బ్రహ్మ’.. మయన్మార్‌కు భారత్ సాయం

image

AP: వరుస భూకంపాలతో అల్లాడుతున్న మయన్మార్‌ను ఆదుకునేందుకు భారత్ ‘ఆపరేషన్ బ్రహ్మ’ ప్రారంభించింది. ఇందులో భాగంగా మయన్మార్‌లో ఏర్పాటు చేయనున్న తాత్కాలిక ఆస్పత్రి కోసం 118 మంది సిబ్బంది వెళ్తారని కేంద్రం వెల్లడించింది. అక్కడ భూకంపాల ఘటనల్లో భారతీయులెవరూ మృతి చెందలేదని తెలిపింది. సహాయక సామగ్రి చేరవేతకు భారత నౌకాదళం చర్యలు చేపట్టగా, ఇప్పటికే INS సావిత్రి, INS సాత్పుర బయల్దేరాయని చెప్పింది.

News March 29, 2025

పార్వతీపురం: పదవ తరగతి విద్యార్థులకు అలెర్ట్

image

ఈనెల 31వ తేదిన జరగబోయే పదవ తరగతి సాంఘిక శాస్త్రం పరీక్ష ఏప్రిల్ 1వ తేదీన నిర్వహించడం జరుగుతుందని DEO ఎన్. తిరుపతి నాయుడు శనివారం తెలిపారు. ప్రభుత్వం ఈనెల 31న రంజాన్ సెలవు ప్రకటించిన నేపథ్యంలో ఈమేరకు మార్పు చేసినట్టు తెలిపారు. కావున పరీక్షా సిబ్బంది అందరూ గమనించి, అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ విషయాన్ని విద్యార్థులందరికీ తెలియజేయాలని సూచించారు.

error: Content is protected !!