News March 25, 2025
పార్కింగ్ ఫీజు రూల్స్.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి

AP: వాణిజ్య సముదాయాలు, మాల్స్, మల్టీప్లెక్స్ల వద్ద తొలి 30min వరకు ఎలాంటి పార్కింగ్ ఫీజు వసూలు చేయవద్దని మున్సిపల్ శాఖ ఆదేశాలిచ్చింది. వస్తువులు కొన్న బిల్స్ చూపిస్తే 30min నుంచి 1hr వరకు ఫీజు తీసుకోవద్దని సూచించింది. సినిమా టికెట్ లేదా ఆ సముదాయంలో పార్కింగ్ ఫీజు కంటే ఎక్కువ మొత్తం విలువైన వస్తువులు కొంటే గంట కంటే ఎక్కువసేపు ఫ్రీగా పార్కింగ్ చేసుకోవచ్చు. ఈ ఆదేశాలు APR 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
Similar News
News March 30, 2025
నెలవంక దర్శనం.. రేపే రంజాన్

మన దేశంలో నెలవంక దర్శనమిచ్చింది. దీంతో రేపు రంజాన్ (ఈద్ ఉల్ ఫితర్)జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలు నిర్ణయించారు. ఈద్గాలు, మసీదుల్లో ప్రభుత్వాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. హైదరాబాద్ మక్కా మసీద్, మీరాలం ఈద్గాల దగ్గర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రంజాన్ సందర్భంగా రేపు సెలవు ప్రకటించారు.
News March 30, 2025
విషాదం.. ఆరుగురి మృతి

హిమాచల్ప్రదేశ్లో భారీ గాలులు, కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఆరుగురు మరణించారు. కులు సమీపంలోని పర్యాటక ప్రాంతంలో ఈదురుగాలులకు చెట్లు నేలకూలాయి. వాటితో పాటు రాళ్లు, శిథిలాలు ఓ వ్యానుతో పాటు అక్కడ కూర్చున్న పర్యాటకులపై పడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు సహా ఆరుగురు చనిపోయారు. చాలా మందికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని పేర్కొన్నారు.
News March 30, 2025
కొత్త రేషన్ కార్డుల్లో 30 లక్షల మంది: సీఎస్

TG: కొత్తగా రేషన్ కార్డుల్లో 30లక్షల మందిని చేర్చనున్నామని సీఎస్ శాంతికుమారి చెప్పారు. హుజూర్ నగర్లో జరిగిన సన్నబియ్యం పథకం ప్రారంభోత్సవంలో ఆమె మాట్లాడారు. సన్నబియ్యం పంపిణీతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.2,800 కోట్ల అదనపు భారం పడుతుందని చెప్పారు. కొత్తగా 10 లక్షల రేషన్ కార్డులు జారీ కానున్నట్లు వెల్లడించారు.