News March 27, 2025
ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఢిల్లీ ప్రభుత్వం మందుల సేకరణ విధానంపై సంచలన నిర్ణయం తీసుకుంది. అక్కడి ఆస్పత్రులు ఇకపై పీఎం జన ఔషధి కేంద్రాల నుంచి మాత్రమే మందులు కొనుగోలు చేయాలని ఆదేశించింది. ఇది అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు వర్తిస్తుందని తెలిపింది. మెడిసిన్స్ కొనుగోలును మరింత పారదర్శకంగా మార్చేందుకు, తక్కువ ధరకు నాణ్యమైన మందులను అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా దీనిపై ఢిల్లీ సర్కారు MoU కూడా కుదుర్చుకుంది.
Similar News
News April 1, 2025
TTD పనితీరు అస్తవ్యస్తం.. చర్యలు తీసుకోండి: PMకు ఎంపీ లేఖ

AP: తిరుమలలో భద్రతా వైఫల్యాలపై జోక్యం చేసుకోవాలంటూ PM మోదీ, హోంమంత్రి అమిత్షాకు YCP MP గురుమూర్తి లేఖ రాశారు. ‘వైకుంఠ ఏకాదశి రోజు తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయారు. అన్నదానం క్యూకాంప్లెక్స్లోనూ తొక్కిసలాట జరిగింది. కొండపైకి మాంసం, మద్యం తీసుకెళ్తున్నారు. పాపవినాశనం డ్యామ్లో నిబంధనలకు విరుద్ధంగా బోట్లు తిప్పారు. TTD పనితీరు అస్తవ్యస్తంగా మారింది. ఈ ఘటనలపై చర్యలు తీసుకోండి’ అని కోరారు.
News April 1, 2025
మా ప్రభుత్వం రూ.వేల కోట్ల భూమిని కాపాడింది: భట్టి

TG: కంచ గచ్చిబౌలిలోని ₹వేల కోట్ల భూమి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా తాము కాపాడామని Dy.CM భట్టి తెలిపారు. ‘400 ఎకరాలను చంద్రబాబు ప్రభుత్వం 2004లో IMG భారత్కు కేటాయిస్తే, 2006లో YSR ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో IMG భారత్ కోర్టుకు వెళ్లింది. అప్పటినుంచి కేసు కోర్టులోనే ఉంది. పదేళ్లుగా BRS కూడా పట్టించుకోలేదు. ప్రైవేటు వ్యక్తుల ద్వారా తమ చేతుల్లోకి తెచ్చుకోవాలని చూసింది’ అని ఆరోపించారు.
News April 1, 2025
భార్యకు పెళ్లి చేసిన భర్త.. ఊహించని మలుపు

UP: భర్తే తన భార్యను ప్రియుడికిచ్చి <<15898025>>పెళ్లి చేసిన ఘటనలో<<>> సినిమా లెవల్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రియుడు వికాస్తో వెళ్లిపోయిన రాధిక మళ్లీ మొదటి భర్త బబ్లూ చెంతకు చేరింది. భార్యకు దూరమై పిల్లలిద్దరి బాధ్యత చూసుకుంటూ బబ్లూ అనుభవించే బాధ గురించి వికాస్ తల్లి తన కొడుక్కి అర్థమయ్యేలా చెప్పింది. దీంతో వికాస్ రాధికను తిరిగి బబ్లూ వద్దకు పంపాడు. తన భార్యను స్వీకరిస్తానని బబ్లూ పంచాయతీలో ఒప్పుకున్నాడు.