News April 1, 2025

మా ప్రభుత్వం రూ.వేల కోట్ల భూమిని కాపాడింది: భట్టి

image

TG: కంచ గచ్చిబౌలిలోని ₹వేల కోట్ల భూమి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా తాము కాపాడామని Dy.CM భట్టి తెలిపారు. ‘400 ఎకరాలను చంద్రబాబు ప్రభుత్వం 2004లో IMG భారత్‌కు కేటాయిస్తే, 2006లో YSR ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో IMG భారత్ కోర్టుకు వెళ్లింది. అప్పటినుంచి కేసు కోర్టులోనే ఉంది. పదేళ్లుగా BRS కూడా పట్టించుకోలేదు. ప్రైవేటు వ్యక్తుల ద్వారా తమ చేతుల్లోకి తెచ్చుకోవాలని చూసింది’ అని ఆరోపించారు.

Similar News

News April 17, 2025

వారికి గౌరవ వేతనం పెంపు: మంత్రి ఫరూఖ్

image

ఏపీలో ప్రత్యేక మెజిస్ట్రేట్ల గౌరవ వేతనం పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గౌరవ వేతనం రూ.45,000, రవాణా సౌకర్యాలకు మరో రూ.5వేలు ఇవ్వనున్నట్లు పేర్కొంది. 2019 ఏప్రిల్ 1 నుంచే ఇది వర్తిస్తుందని మంత్రి ఫరూక్ తెలిపారు.

News April 17, 2025

గిట్టుబాటు ధర లేదు.. ఉపాధి కూలీలకు డబ్బు చెల్లించట్లేదు: బొత్స

image

AP: కూటమి నేతల మాటలకు, చేతలకు పొంతన లేదని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. అధికార పార్టీ నేతలు డబ్బు డిమాండ్ చేస్తుండటంతో పరిశ్రమలు వెనక్కిపోతున్నాయని ఆరోపించారు. గిట్టుబాటు ధర లేక మిర్చి రైతులు అల్లాడిపోతున్నారని, ఉపాధి కూలీలకూ డబ్బులు చెల్లించట్లేదని ఫైరయ్యారు. 10 నెలల్లో ఒక్కరికైనా కొత్తగా పెన్షన్ ఇచ్చారా? అని నిలదీశారు. హామీలపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.

News April 17, 2025

ఈ నెల 24న OTTలోకి ‘L2: ఎంపురాన్’

image

పృథ్వీరాజ్ సుకుమారన్ స్వీయ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన ‘L2: ఎంపురాన్’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది. ఈ నెల 24 నుంచి మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. మార్చి 27న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం దాదాపు రూ.270 కోట్ల కలెక్షన్లు సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది. అలాగే మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది.

error: Content is protected !!