News March 25, 2024
ఈ నెల 30 నుంచి జనంలోకి జనసేనాని

AP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 30న పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారని.. అక్కడ ఉంటూనే AP వ్యాప్తంగా ప్రచారానికి వెళ్తారని పార్టీ వెల్లడించింది. తొలిరోజు శక్తిపీఠమైన శ్రీ పురుహూతిక అమ్మవారిని, అనంతరం దత్తపీఠాన్ని దర్శించుకోనున్న ఆయన.. ఆ తర్వాత మూడు రోజులు పిఠాపురంలోనే ఉంటారు. ఉగాది వేడుకలను కూడా అక్కడే పవన్ నిర్వహించుకోబోతున్నారు.
Similar News
News April 8, 2026
ఇరాన్కు డెడ్లైన్ గడువును పొడిగించిన ట్రంప్

ఇరాన్కు విధించిన డెడ్లైన్ గడువును 2 వారాలపాటు పొడిగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. <<19594813>>పాక్ అభ్యర్థన<<>> మేరకు 14 రోజులపాటు దాడులు నిలిపివేసేందుకు అంగీకరించానన్నారు. ‘హార్ముజ్ను వెంటనే తెరిచేందుకు ఇరాన్ అంగీకరించిందన్న షరతుకు లోబడి దీనికి నేను ఒప్పుకున్నా. ఈ సీజ్ఫైర్ ఇరువైపులా వర్తిస్తుంది. ఇరాన్ 10 పాయింట్ల ప్రపోజల్ అందింది. శాంతి ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి’ అని పేర్కొన్నారు.
News April 8, 2026
నోటిఫైడ్ డిసీజ్గా క్యాన్సర్.. ప్రతీ కేసు వివరాలు చెప్పాల్సిందే!

TG: క్యాన్సర్ను నోటిఫైడ్ డిసీజ్గా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఇకపై రాష్ట్రంలో ఎక్కడ క్యాన్సర్ కేసు నమోదైనా ప్రభుత్వానికి సమాచారమివ్వాలని ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులను ఆదేశించింది. బాధితుల వివరాలను గోప్యంగా ఉంచి, వాటిని నెల రోజుల్లో ప్రభుత్వ పోర్టల్లో నమోదు చేయాలని సూచించింది. సరైన వైద్య విధానాల రూపకల్పనకు, స్క్రీనింగ్ టెస్టులు చేసేందుకు ఈ డేటా సాయపడుతుందని అధికారులు తెలిపారు.
News April 8, 2026
ఇలా దొరికిపోయావేంటి షరీఫ్!

ఇరాన్కు విధించిన <<19594789>>డెడ్లైన్ను పొడిగించాలంటూ<<>> పాక్ PM షహబాజ్ షరీఫ్ చేసిన ట్వీట్పై నెట్టింట ట్రోల్స్ వస్తున్నాయి. ”Draft- Pakistan’s PM Message on X’ అనే టైటిల్తో మొదట పోస్ట్ చేసిన ఆయన తర్వాత దానిని ఎడిట్ చేశారు. దీంతో ఎవరో పంపిన మెసేజ్ను ఆయన కాపీ పేస్ట్ చేశారని, బహుశా అమెరికా పంపిన మెసేజ్ అయ్యుండొచ్చని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. US చేతిలో పాక్ కీలుబొమ్మలా మారిందని అంటున్నారు.


