News March 29, 2025
‘ఆపరేషన్ బ్రహ్మ’.. మయన్మార్కు భారత్ సాయం

AP: వరుస భూకంపాలతో అల్లాడుతున్న మయన్మార్ను ఆదుకునేందుకు భారత్ ‘ఆపరేషన్ బ్రహ్మ’ ప్రారంభించింది. ఇందులో భాగంగా మయన్మార్లో ఏర్పాటు చేయనున్న తాత్కాలిక ఆస్పత్రి కోసం 118 మంది సిబ్బంది వెళ్తారని కేంద్రం వెల్లడించింది. అక్కడ భూకంపాల ఘటనల్లో భారతీయులెవరూ మృతి చెందలేదని తెలిపింది. సహాయక సామగ్రి చేరవేతకు భారత నౌకాదళం చర్యలు చేపట్టగా, ఇప్పటికే INS సావిత్రి, INS సాత్పుర బయల్దేరాయని చెప్పింది.
Similar News
News April 2, 2025
కంచ గచ్చిబౌలి భూములపై నివేదిక కోరిన కేంద్రం

TG: కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిపై వాస్తవిక నివేదిక ఇవ్వాలని రాష్ట్ర అటవీశాఖను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అటవీ చట్టానికి లోబడి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. కోర్టులు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించలేదన్న విషయాన్ని నిర్ధారించుకోవాలని పేర్కొంది.
News April 2, 2025
ఇలాంటివి మన వద్దా ఏర్పాటు చేయొచ్చుగా..!

భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. అత్యవసరమై మండుటెండలో బయటకు వస్తే సిగ్నల్స్ వద్ద ఉడికిపోవాల్సి వస్తోంది. ఈక్రమంలో వాహనదారులకు ఉపశమనం కలిగించేందుకు ఒడిశాలోని భువనేశ్వర్ మున్సిపల్ అధికారులు వినూత్నంగా ఆలోచించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ క్లాత్తో తాత్కాలిక టెంట్ ఏర్పాటు చేశారు. ఇలాంటివి మన వద్దా ఏర్పాటు చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
News April 2, 2025
2.O భిన్నంగా ఉంటుంది: జగన్

AP: వచ్చే ఎన్నికల్లో YCP భారీ మెజారిటీతో గెలుస్తుందని మాజీ సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు. ‘కళ్లు మూసుకుంటే మూడేళ్లు గడిచిపోతాయి. కరోనా వల్ల కార్యకర్తలకు నేను చేయాల్సినంత చేసుండకపోవచ్చు. ఈసారి జగన్ 2.O భిన్నంగా ఉంటుంది. కార్యకర్తల కోసం గట్టిగా నిలబడతా. రాబోయే రోజులు మనవే’ అని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమావేశంలో పేర్కొన్నారు. హామీలు ఎగ్గొట్టడానికి అప్పులపై CBN అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.