News March 29, 2025
‘ఆపరేషన్ బ్రహ్మ’.. మయన్మార్కు భారత్ సాయం

AP: వరుస భూకంపాలతో అల్లాడుతున్న మయన్మార్ను ఆదుకునేందుకు భారత్ ‘ఆపరేషన్ బ్రహ్మ’ ప్రారంభించింది. ఇందులో భాగంగా మయన్మార్లో ఏర్పాటు చేయనున్న తాత్కాలిక ఆస్పత్రి కోసం 118 మంది సిబ్బంది వెళ్తారని కేంద్రం వెల్లడించింది. అక్కడ భూకంపాల ఘటనల్లో భారతీయులెవరూ మృతి చెందలేదని తెలిపింది. సహాయక సామగ్రి చేరవేతకు భారత నౌకాదళం చర్యలు చేపట్టగా, ఇప్పటికే INS సావిత్రి, INS సాత్పుర బయల్దేరాయని చెప్పింది.
Similar News
News January 16, 2026
ప్రాధాన్యం సంతరించుకున్న మోదీ WB టూర్

PMమోదీ రేపు, ఎల్లుండి WBలో చేపట్టనున్న పర్యటన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. APRలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ₹3,250CR ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. ఇతర రాష్ట్రాలకు 7 అమృత్ భారత్ రైళ్లను, తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్ను ప్రారంభిస్తారు. సింగూర్లో ₹830CR అభివృద్ధి పనులకు శ్రీకారం, బాలాగఢ్లో 900 ఎకరాల్లో కార్గో హ్యాండ్లింగ్ టెర్మినల్కు శంకుస్థాపన చేస్తారు.
News January 16, 2026
2034 వరకు ప్రభుత్వాన్ని కొనసాగిస్తాం: సీఎం

TG: తాను ఓడిపోయిన వారి గురించి మాట్లాడదలుచుకోలేదని సీఎం రేవంత్ పరోక్షంగా కేసీఆర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘నాకిచ్చిన బాధ్యతతో పని చేయాలి అనుకుంటున్నా. ఇతరుల గురించి మాట్లాడి టైమ్ వేస్ట్ చేయను. రాబోయే ఎన్నికలతో పాటు 2034 వరకు ప్రభుత్వాన్ని కొనసాగిస్తాం’ అని నిర్మల్ సభలో స్పష్టం చేశారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరిస్తామని హామీ ఇచ్చారు.
News January 16, 2026
టోల్ ప్లాజాల దగ్గర ఇక నో క్యాష్ పేమెంట్స్?

వంద శాతం డిజిటల్ టోలింగ్ దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. టోల్ ప్లాజాల దగ్గర క్యాష్ పేమెంట్స్ను పూర్తిగా నిలిపేసి కేవలం FASTag లేదా UPI ద్వారానే వసూలు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ యోచిస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. చిల్లర సమస్యలు, ట్రాఫిక్ జామ్లకు స్వస్తి పలకడమే లక్ష్యంగా ఈ మార్పు తీసుకురానున్నారు. దీనిపై ఇంకా అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు.


