News March 30, 2025
అంగళ్లు : గ్యాస్ సిలిండర్ పేలి గాయపడ్డ వ్యక్తి మృతి

అంగళ్లులో గ్యాస్ సిలిండర్ పేలి గాయపడ్డ టీ కొట్టు నిర్వాహకుడు కృష్ణయ్య మృతి చెందాడని పోలీసులు ఆదివారం తెలిపారు. కురబలకోట మండలం, అంగళ్లులో ఈనెల 22 న టీ కొట్టు నడుపుతుండగా గ్యాస్ సిలిండర్ పేలి కృష్ణయ్య తీవ్రంగా గాయపడ్డారు. బాధితున్ని వెంటనే మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, అక్కడి నుంచి తిరుపతి రుయాకు తరలించారు. రుయాలో చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News April 2, 2025
ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు.. వాయుసేన ఆమోదం

TG: ఆదిలాబాద్లో ఎయిర్పోర్టును అభివృద్ధి చేసేందుకు వాయుసేన సూచనప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. పౌరవిమానయాన అవసరాలకు తగినట్లుగా అక్కడ రన్వే పునర్నిర్మాణం, టర్మినల్, మౌలిక వసతుల ఏర్పాట్ల అభివృద్ధికి ఆమోదం తెలిపింది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో కలిసి ఎయిర్పోర్టును సంయుక్త ప్రయోజనాలకు వాడేందుకు సమ్మతి తెలిపింది.
News April 2, 2025
1,161 ఉద్యోగాలు.. రేపే లాస్ట్

CISF భర్తీ చేయనున్న 1,161 పోస్టుల దరఖాస్తు ప్రక్రియ గడువు APR 3తో ముగియనుంది. కానిస్టేబుల్/ట్రేడ్స్మెన్ పోస్టులకు మెట్రిక్యులేషన్ కలిగిన 18 – 23 ఏళ్ల అభ్యర్థులు అర్హులు. అన్రిజర్వ్డ్, OBC, EWS అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.100 కాగా మహిళలు, SC, STలకు ఉచితం. వయసు 18-23ఏళ్ల మధ్య ఉండాలి. జీతం నెలకు రూ.21,700-రూ.69,100 వరకు ఇస్తారు.
వెబ్సైట్: <
News April 2, 2025
KMR: సన్నం బియ్యం పంపిణీ ప్రారంభించిన కలెక్టర్

కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో సన్నం బియ్యం పథకాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బియ్యం నాణ్యతను, తూకాన్ని ఆయన పరిశీలించారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ సన్న బియ్యం అందుతాయని కలెక్టర్ తెలిపారు. పంపిణీ ప్రక్రియ సజావుగా జరిగేలా రేషన్ షాపుల్లో అధికారులతో తనిఖీలు చేయించినట్లు పేర్కొన్నారు.