News March 26, 2024
జియో రూ.555 రీఛార్జ్ ఫ్రీ అంటూ ప్రచారం

జియో ఫ్రీ రీఛార్జ్ పేరిట సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని సైబర్ నిపుణులు హెచ్చరించారు. ‘జియో ప్రారంభించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఉచితంగా రూ.555 రీఛార్జ్ పొందండి’ అని మెసేజ్లు పంపుతున్నారని తెలిపారు. ఇలాంటి ఉచిత ఆఫర్లను నమ్మి, వారు పంపిన లింకులను క్లిక్ చేస్తే వ్యక్తిగత, బ్యాంకు ఖాతా వివరాలు చోరీ అవుతాయన్నారు. వాట్సాప్లలో వచ్చే ఇలాంటి నకిలీ ఆఫర్లను నమ్మవద్దని సూచించారు.
Similar News
News February 5, 2026
స్వెటర్లు ఎలా ఉతకాలంటే?

ఉన్ని బట్టల్ని ఎప్పుడు కూడా వేడి నీటిలో ఉతకకూడదు. గోరువెచ్చగా ఉన్న నీటినే వాడాలి. వాటిని గట్టిగా మెలితిప్పొద్దు. బట్టలు బయటి రంగు వెలవకుండా లోపలికి తిప్పి బట్టల్ని నానబెట్టి ఉతకాలి. అప్పుడే బట్టలకి ఉన్న మురికి, దుమ్ము, ధూళి మొత్తం పోతుంది. వీటిని ఎండలో ఆరేయొద్దు. నీడలో ఆరబెట్టడం మంచిది. హ్యాంగర్పై వేలాడదీయడం వల్ల బట్టలు సాగినట్లుగా మారతాయి. కాబట్టి హ్యాంగర్స్ వాడకూడదు.
News February 5, 2026
జీతం కన్నా జీవితం ముఖ్యం!

సాఫ్ట్వేర్ రంగంలో ప్రస్తుతం పరిస్థితులు దయనీయంగా ఉన్నాయని ఉద్యోగులు వాపోతున్నారు. అయితే ఉద్యోగం పోవడం, లేదంటే పని ఒత్తిడి పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి పని చేయడం తన వల్ల కావట్లేదంటూ HYD మియాపూర్లో నిన్న ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘ఉద్యోగులు ఒత్తిడికి లోనవకండి. యాజమాన్యం కూడా ఆఫీస్లో మంచి పని వాతావరణాన్ని సృష్టించాలి’ అని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.
News February 5, 2026
CCRSలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

చెన్నైలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధ <


