News March 26, 2024
దుర్గమ్మ ప్రత్యేక దర్శనాలకు టికెట్ తప్పనిసరి

AP: విజయవాడలోని దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ప్రత్యేక దర్శనాలకు టికెట్ తప్పనిసరి చేస్తూ EO రామారావు ఆదేశాలు జారీ చేశారు. ₹100, ₹300, ₹500 టికెట్లు ఉన్నప్పటికీ కొనుగోలు చేయకుండా పలువురు సిఫార్సుల పేరుతో నేరుగా దర్శనానికి వెళ్తున్నారు. దీంతో ఆదాయం తగ్గిపోయింది. ఇకపై అంతరాలయ దర్శనం చేసుకునే భక్తులకు ₹500 టికెట్ ఉండాల్సిందేనని ఈవో స్పష్టం చేశారు. నిత్యం తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు.
Similar News
News February 10, 2026
శ్రీలంక జట్టుకు కీలక ప్లేయర్ దూరం

T20 WC జరుగుతున్న వేళ శ్రీలంక జట్టుకు బిగ్ షాక్ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు స్టార్ ప్లేయర్ వనిందు హసరంగ టోర్నీ మొత్తానికి దూరమయ్యారు. అతని ఎడమ కాలి కండరాల్లో చీలిక ఏర్పడినట్లు MRI స్కానింగ్లో తేలడంతో జట్టు నుంచి తప్పించారు. హసరంగ స్థానంలో లెగ్ స్పిన్ ఆల్రౌండర్ దుషాన్ హేమంతకు జట్టులో చోటు కల్పించారు. 8వ తేదీ ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో శ్రీలంక గెలుపొందిన విషయం తెలిసిందే.
News February 10, 2026
ఫీజ్ రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల

AP: విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రూ.1,200 కోట్ల ఫీజ్ రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
News February 10, 2026
ఎల్లుండి నుంచి MLAలకు డిజిటల్ అటెండెన్స్!

AP: అసెంబ్లీకి కొందరు సభ్యులు గైర్హాజరు అవుతుండటంతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు సభ్యుల ఫింగర్ ప్రింట్స్ నమోదు చేసి.. ఎల్లుండి నుంచి డిజిటల్ విధానంలో హాజరు తీసుకోనున్నట్లు చెప్పారు. అలాగే MLA తనకు కేటాయించిన స్థానంలో కూర్చుంటేనే అటెండెన్స్ నమోదు చేస్తామని పేర్కొన్నారు. అటు రేపు జగన్తో పాటు వైసీపీ సభ్యులు అసెంబ్లీకి వెళ్తారని ఆ పార్టీ నేత బొత్స తెలిపారు.


