News April 1, 2025

అత్యంత ఖరీదైన చాక్లెట్.. 50gmsకి రూ.3.2లక్షలు

image

చాక్లెట్‌ను ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. కొందరికైతే అత్యంత ఖరీదైన, అరుదైన చాక్లెట్స్ తినాలనే కోరిక ఉంటుంది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన చాక్లెట్ ‘To’ak’ గురించి మీకు తెలుసా? ‘To’ak’ 50gms బార్ ధర $3,850 (సుమారు రూ. 3.29లక్షలు). ఏంటి షాక్ అవుతున్నారా? దీనిని అరుదైన, పురాతన కోకో గింజల నుంచి తయారు చేస్తారు. చేతితో తయారు చేసిన గోల్డ్ ప్లేటెడ్ చెక్క బాక్సులో పెట్టి అమ్ముతారు. అందుకే ఇంత ధర.

Similar News

News September 11, 2025

గణేశ్ వేడుకల్లో అసభ్యప్రవర్తన.. 1,612 మందిని పట్టుకున్న షీటీమ్స్

image

TG: గణేశ్ వేడుకల్లో మహిళలతో 1,612 మంది అసభ్యంగా ప్రవర్తించినట్లు షీటీమ్స్ గుర్తించింది. వీరిలో 68 మంది మైనర్లు ఉన్నారని పేర్కొంది. ఎక్కువ మంది 18-30 ఏళ్లలోపు వారేనని వెల్లడించింది. 168 మందిపై ‘పెట్టీ’ కేసులు నమోదు చేసి వీరిలో 70 మందిని కోర్టులో హాజరుపరచామని తెలిపింది. మరో 1,444 మందికి కౌన్సెలింగ్ నిర్వహించి వార్నింగ్ ఇచ్చినట్లు పేర్కొంది.
*షీటీమ్స్ సాయానికి డయల్ 100/వాట్సాప్ 9490616555

News September 10, 2025

‘అఖండ-2’కు OTT రైట్స్ @రూ.80కోట్లు?

image

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘అఖండ-2’ మూవీ డిజిటల్ రైట్స్ రూ.80+ కోట్లు పలికినట్లు సినీ వర్గాలు తెలిపాయి. OTT సంస్థ నెట్‌ఫ్లిక్స్ దీనిని దక్కించుకుందని పేర్కొన్నాయి. ‘అఖండ’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకుంది. ఈ మూవీని డిసెంబర్‌ తొలివారంలో రిలీజ్ చేస్తామని ఇటీవల బాలయ్య తెలిపారు.

News September 10, 2025

ఉపరాష్ట్రపతి ఎన్నికలో 7 పార్టీల క్రాస్ ఓటింగ్?

image

ఉపరాష్ట్రపతి ఎన్నికలో రాధాకృష్ణన్‌కు 15 మంది ఇండీ కూటమి MPలు క్రాస్ ఓటింగ్ చేశారని News18 వెల్లడించింది. ఈ మేరకు NDA వర్గాలు చెప్పాయంది. ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) నుంచి ఐదుగురు, శివసేన(UBT) నుంచి నలుగురు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు, DMK, JMM, RJD, NCP(SP)ల నుంచి ఒకరు చొప్పున క్రాస్ ఓటింగ్ చేసినట్లు పేర్కొంది. మరోవైపు NDA తమ MPలకు 2 రోజులు ట్రైనింగ్ సెషన్స్ నిర్వహించి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకుంది.