News April 3, 2025
ALERT.. కాసేపట్లో వర్షం

తెలంగాణ వ్యాప్తంగా కాసేపట్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. జగిత్యాల, ములుగు, KRMR, MDK, సిరిసిల్ల, సిద్దిపేట, భువనగిరి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ ఇచ్చింది. HYD, మంచిర్యాల, మేడ్చల్, NLG, RR, VKB జిల్లాల్లో పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మీ ప్రాంతంలో వర్షం కురుస్తోందా? కామెంట్ చేయండి.
Similar News
News April 14, 2025
అంబేడ్కర్ కలలుగన్న సమసమాజాన్ని సాధించుకుందాం: CM

AP: ఆధునిక భారత సమాజ నిర్మాణానికి అంబేడ్కర్ పునాదులు వేశారని సీఎం చంద్రబాబు కొనియాడారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆ మహానుభావుని దేశసేవను స్మరించుకుందామన్నారు. ‘ఆ మహాశయుని వాక్కు స్ఫూర్తిగా బడుగు వర్గాల ఆత్మగౌరవాన్ని నిలపడానికి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి అంకితభావంతో మనందరం కృషి చేద్దాం. అంబేడ్కర్ కలలుగన్న సమసమాజాన్ని సాధించుకుందాం’ అని ట్వీట్ చేశారు.
News April 14, 2025
అంబేడ్కర్ ఆకాంక్షలకు అనుగుణంగా బీఆర్ఎస్ పాలన: KCR

TG: డా.బీ.ఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఆయనకు మాజీ సీఎం KCR నివాళులు అర్పించారు. ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తుచేశారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా BRS పాలన సాగిందని, దళితబంధు సహా అనేక పథకాలను అమలు చేశామని తెలిపారు. నేటి ప్రభుత్వం వాటిని కొనసాగించాలని, అప్పుడే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
News April 14, 2025
రూ.13వేల కోట్ల మోసం.. మెహుల్ ఛోక్సీ అరెస్టు

వజ్రాల వ్యాపారి, పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB)ను మోసగించిన కేసులో ప్రధాన నిందితుడైన మెహుల్ ఛోక్సీని బెల్జియం పోలీసులు అరెస్టు చేశారు. భారత ఏజెన్సీలైన CBI, ED విజ్ఞప్తి మేరకు అతడిని అరెస్టు చేశారు. ఛోక్సీపై గతంలో ముంబైలో నాన్-బెయిలబుల్ వారెంట్లు నమోదయ్యాయి. PNBని రూ.13వేల కోట్లకు పైగా మోసం చేశారని 2018లో ఆరోపణలు రాగా ఛోక్సీ, నీరవ్ మోదీ విదేశాలకు పారిపోయారు. అతడి మేనల్లుడు నీరవ్ లండన్ జైలులో ఉన్నారు.