News April 3, 2025
PF విత్డ్రా మరింత సులభం: EPFO

EPFO నుంచి నగదు విత్డ్రా మరింత ఈజీ కానుంది. ఇకపై డబ్బు విత్డ్రా చేయడానికి క్యాన్సిల్ చెక్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదని కార్మిక మంత్రిత్వ శాఖ ఇవాళ ప్రకటించింది. దీంతో పాటు బ్యాంక్ అకౌంట్ను యజమానులు ధ్రువీకరించాల్సిన అవసరం లేదంది. దీని ద్వారా కోట్ల మందికి సులభంగా క్లెయిమ్ సెటిల్ కానుంది. ఏడాదిగా కోటిన్నర మందిపై నిర్వహించిన ట్రయల్స్ విజయవంతం కావడంతో అందరికీ ఈ సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొంది.
Similar News
News September 12, 2025
త్వరలో డిగ్రీ, పీజీ కాలేజీల్లో ఫేషియల్ అటెండెన్స్

TG: డిగ్రీ, పీజీ కాలేజీల్లో త్వరలో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానం అమలు కానుంది. దీనిపై చర్చించేందుకు ఇవాళ అన్ని వర్సిటీల VCలతో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనుంది. స్టూడెంట్స్తో పాటు టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. అన్ని విద్యాసంస్థల్లో ఫేషియల్ అటెండెన్స్ను అమల్లోకి తేవాలని ఇటీవల జరిగిన సమీక్షలో సీఎం రేవంత్ ఆదేశించిన సంగతి తెలిసిందే.
News September 12, 2025
SBIలో 122 ఉద్యోగాలు

SBI 122 పోస్టుల భర్తీకి <
News September 12, 2025
లోన్ చెల్లించకపోతే ఫోన్ లాక్.. త్వరలో కొత్త రూల్?

లోన్పై కొనుగోలు చేసిన ఫోన్ల విషయంలో RBI కొత్త రూల్ తీసుకొచ్చే అవకాశం ఉంది. సకాలంలో లోన్ చెల్లించకపోతే ఫోన్లను రిమోట్ విధానంలో లాక్ చేసేలా రుణదాతలకు RBI అనుమతి ఇవ్వనున్నట్లు జాతీయ మీడియా తెలిపింది. ‘దీనికి యూజర్ల ముందస్తు అనుమతి, డేటా ప్రొటెక్షన్ను తప్పనిసరి చేస్తూ మార్గదర్శకాలను రూపొందించనుంది. ఫోన్ లాక్ అయ్యేందుకు అందులో ముందే ఓ యాప్ను ఇన్స్టాల్ చేస్తారు’ అని పేర్కొంది.