News April 4, 2025

YCP నేత కేతిరెడ్డి గెస్ట్ హౌస్ స్థలం సర్కార్‌దే: అధికారులు

image

AP: అనంతపురం జిల్లా ధర్మవరం YCP మాజీ MLA కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గెస్ట్ హౌస్ స్థలం ప్రభుత్వానిదేనని అధికారులు నిర్ధారించారు. ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లగా గేటు వేసి ఉండటంతో వారు వెనుదిరిగారు. ఈ భూమిని కేతిరెడ్డి తన కుటుంబసభ్యుల పేరుతో రిజిస్టర్ చేసినట్లు గుర్తించారు. కాగా గుర్రాలకొండపై కేతిరెడ్డి ఓ అతిథి గృహం నిర్మించుకున్నారు. కానీ ఇది అసైన్డ్ భూమి అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Similar News

News April 12, 2025

ధోనీపై తమిళ హీరో అసహనం

image

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీపై తమిళ సినీ హీరో విష్ణు విశాల్ అసహనం వ్యక్తం చేశారు. ‘లోయర్ ఆర్డర్‌‌లో బ్యాటింగ్‌కు రావడం ఎందుకు? ఇదంతా ఓ సర్కస్‌లా ఉంది. స్పోర్ట్ కంటే ఎవరూ గొప్ప కాదు’ అని ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్‌కు పలువురు నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు. ఇవాళ KKRతో మ్యాచులో జట్టు కష్టాల్లో ఉండగా ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చారు. 4 బంతుల్లో ఒక్క రన్ మాత్రమే చేసి ఔటయ్యారు.

News April 12, 2025

PHOTOS: ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం

image

AP: ఒంటిమిట్టలో శ్రీకోదండరామస్వామి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. సీతారాముల కళ్యాణాన్ని వీక్షించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. అంతకుముందు సీఎం చంద్రబాబు దంపతులు స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. ఈ కళ్యాణోత్సవానికి సంబంధించిన ఫొటో గ్యాలరీని పైన చూడొచ్చు.

News April 11, 2025

IPL: చెన్నైని చిత్తు చేసిన KKR

image

చెపాక్ స్టేడియంలో చెన్నైని కేకేఆర్ చిత్తు చేసింది. 8 వికెట్ల తేడాతో ఘన విజయం సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన CSK 20 ఓవర్లలో 103 పరుగులే చేసింది. ఛేదనలో కోల్‌కతా బ్యాటర్లు వీరవిహారం చేశారు. నరైన్(44), డికాక్(23), రహానే(20) మెరుపులతో ఆ జట్టు 10.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కాగా ఇది సీఎస్కేకు వరుసగా ఐదో పరాజయం.

error: Content is protected !!