News April 4, 2025

రాష్ట్రంలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు

image

AP: రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పెరిగి, రూ.30 వేలకు కోట్లకు పైగా బిజినెస్ జరిగింది. 2024-25లో సగటున రోజుకు రూ.83.38కోట్ల విలువైన మద్యం తాగేశారు. అయితే ప్రభుత్వం లిక్కర్ ధర తగ్గించడంతో అమ్మకాలు పెరిగినా రాబడి పెద్దగా లేదు. దీంతో గతేడాదితో పోలిస్తే విక్రయాల్లో 9.1 శాతం పెరుగుదల కనిపించినా.. విలువ 0.34 శాతం మాత్రమే పెరిగింది. అత్యధికంగా కర్నూలు, అత్యల్పంగా కడప జిల్లాలో అమ్మకాలు జరిగాయి.

Similar News

News April 12, 2025

దంచికొడుతున్న SRH ఓపెనర్లు

image

పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచులో SRH ఓపెనర్లు దంచికొడుతున్నారు. అభిషేక్ శర్మ (87*), ట్రావిస్ హెడ్ (49*) ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతున్నారు. అభిషేక్‌కు ఓ లైఫ్ రావడంతో రెచ్చిపోయి ఆడుతున్నారు. వీరిద్దరి ధాటికి SRH 10 ఓవర్లకు 143/0 పరుగులు చేసింది. SRH విజయానికి మరో 10 ఓవర్లలో 103 రన్స్ అవసరం. మరి ఎన్ని ఓవర్లలో హైదరాబాద్ టార్గెట్ ఛేజ్ చేస్తుందో కామెంట్ చేయండి.

News April 12, 2025

బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి

image

TG: వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు ఆ పార్టీ నేతలు పోలీసుల నుంచి అనుమతి పత్రాలు అందుకున్నారు. రజతోత్సవ సభ అనుమతుల కోసం బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించింది. పోలీసులు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో హైకోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకోనున్నట్లు పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.

News April 12, 2025

గ్యాస్ సబ్సిడీ జమ కాలేదా?

image

AP: ఆధార్/రేషన్‌కార్డుతో గ్యాస్ కనెక్షన్ లింక్ కాకపోవడంతో పలువురికి దీపం-2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు అందడం లేదు. మార్చి 31 నాటికి దాదాపు 14వేల మందికి సబ్సిడీ సొమ్ము బ్యాంకు అకౌంట్‌లో జమ కాలేదు. దీంతో ప్రజలు ఏజెన్సీలు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కొత్తగా ఆన్‌లైన్‌లో దీపం-2 డ్యాష్‌బోర్డును సిద్ధం చేసింది. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది.

error: Content is protected !!