News April 4, 2025

రాష్ట్రంలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు

image

AP: రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పెరిగి, రూ.30 వేలకు కోట్లకు పైగా బిజినెస్ జరిగింది. 2024-25లో సగటున రోజుకు రూ.83.38కోట్ల విలువైన మద్యం తాగేశారు. అయితే ప్రభుత్వం లిక్కర్ ధర తగ్గించడంతో అమ్మకాలు పెరిగినా రాబడి పెద్దగా లేదు. దీంతో గతేడాదితో పోలిస్తే విక్రయాల్లో 9.1 శాతం పెరుగుదల కనిపించినా.. విలువ 0.34 శాతం మాత్రమే పెరిగింది. అత్యధికంగా కర్నూలు, అత్యల్పంగా కడప జిల్లాలో అమ్మకాలు జరిగాయి.

Similar News

News September 12, 2025

‘కిష్కింధపురి’ పబ్లిక్ టాక్

image

కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ నటించిన హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’ సినిమా ప్రీమియర్లు పడ్డాయి. మూవీ చూసిన వాళ్లు తమ అభిప్రాయాలు చెబుతున్నారు. హీరోహీరోయిన్ల యాక్టింగ్, విజువల్స్ బాగున్నాయని అంటున్నారు. స్క్రీన్ ప్లే, సెకండాఫ్‌పై ఇంకాస్త దృష్టి పెట్టాల్సిందని చెబుతున్నారు. మరికొన్ని గంటల్లో Way2News రివ్యూ&రేటింగ్.

News September 12, 2025

ఎయిర్‌టెల్ డౌన్.. కస్టమర్ల ఫైర్

image

ఎయిర్‌టెల్ కస్టమర్లు నెట్‌వర్క్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2 రోజులుగా సరిగా సిగ్నల్స్ రావడం లేదని వాపోతున్నారు. మొబైల్ నెట్‌వర్క్‌తో పాటు ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ నెట్ కూడా పనిచేయడం లేదంటున్నారు. కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. SMలో తమ అసంతృప్తిని తెలియజేస్తూ ‘#AirtelDown, #BanAirtel’ హ్యాష్‌ట్యాగ్‌లను ట్రెండ్ చేస్తున్నారు. మీకూ నెట్‌వర్క్ సమస్య ఎదురవుతోందా?

News September 12, 2025

బజరంగ్‌ పునియా తండ్రి కన్నుమూత

image

భారత రెజ్లర్, ఒలింపిక్ మెడల్ విజేత బజరంగ్‌ పునియా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి బల్వాన్ పునియా ఊపిరితిత్తుల సమస్యతో కన్నుమూశారు. ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో గత 18 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన నిన్న సాయంత్రం తుదిశ్వాస విడిచారు. తమను ఈ స్థాయికి తీసుకొచ్చేందుకు తన తండ్రి చాలా కష్టపడ్డారని, కుటుంబానికి ఆయనే వెన్నెముక అని బజరంగ్‌ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.