News April 5, 2025

మేడ్చల్: 16 వేలు దాటిన దరఖాస్తులు..!

image

MDCL మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ‘యువ వికాస పథకం’ దరఖాస్తుల సంఖ్య 16 వేల మార్క్ దాటినట్లుగా జిల్లా అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ గౌతమ్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిస్థితులను పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకునే వారికి గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలలోపు ఆదాయం ఉండాలన్నారు.

Similar News

News April 12, 2025

రొయ్యల మేత ధర కిలోకు రూ.4 తగ్గింపు

image

AP: పెరిగిన ఖర్చులు, ఎగుమతి కౌంట్ రేట్లు తగ్గిన నేపథ్యంలో ఆక్వా రైతులు ఆందోళన బాట పట్టారు. దీంతో రొయ్యల మేత ధరను కిలోకు ₹4 చొప్పున ఫీడ్ కంపెనీలు తగ్గించాయి. <<16027501>>సీఎం చంద్రబాబు<<>> ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, నేటి నుంచి అమలు చేస్తామని వెల్లడించాయి. అయితే కిలోకు ₹20-25 తగ్గిస్తే ప్రయోజనం ఉంటుందని రైతులు చెబుతున్నారు. కాగా రొయ్యల ధరలను తగ్గించొద్దని వ్యాపారులను ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే.

News April 12, 2025

సిరిసిల్ల: ఈనెల 21 లోపు దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్

image

ఈనెల 21 లోపు ముంపు గ్రామాల ప్రజలు ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోవాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. మిడ్‌మానేరు ముంపు గ్రామాల ప్రజలు ఈనెల 11 నుంచి 21 వరకు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

News April 12, 2025

ALERT: వడగాలులు బాబోయ్!

image

AP: రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు పడుతున్నప్పటికీ వడగాలుల తీవ్రత మాత్రం పరాకాష్ఠకు చేరింది. మధ్యాహ్నవేళల్లో బయటికి రావాలంటేనే జనం భయపడుతున్నారు. ఆ తీవ్రత కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈరోజు 66 మండలాల్లో వడగాడ్పులు వీయొచ్చని తెలిపింది. అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృ‌ష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

error: Content is protected !!