News April 6, 2025
జియో వినియోగదారులకు ఆఫర్ పొడిగింపు

IPL సందర్భంగా జియో తమ ప్రీపెయిడ్ వినియోగదారులకు జియో హాట్స్టార్ యాక్సెస్ను ఫ్రీగా అందిస్తోంది. పలు రీఛార్జ్లపై గతంలో ప్రకటించిన ఈ ఆఫర్ను తాజాగా ఏప్రిల్ 15 వరకు పొడిగించింది. ఆలోగా ₹100/₹195/₹949తో రీఛార్జ్ చేసుకుంటే దాదాపు 90days యాప్ ఫ్రీగా చూడవచ్చు. ₹100 రీఛార్జ్కు 5GB డేటా, ₹195కి 15GB డేటా, ₹949తో రీఛార్జ్ చేసుకుంటే 84days వ్యాలిడిటీతో డైలీ 2GB డేటా, అన్ లిమిటెడ్ 5G డేటా&కాల్స్ పొందవచ్చు.
Similar News
News April 11, 2025
గోరంట్ల మాధవ్ను కొట్టిన పోలీస్?

AP: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్పై ఓ పోలీస్ అధికారి చేయిచేసుకున్నట్లు సమాచారం. వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన <<16055063>>టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ను<<>> అరెస్టు చేసి తీసుకెళ్తుండగా పోలీస్ వాహనాన్ని మాధవ్ అడ్డుకున్నారు. దీంతో ఓ పోలీస్ ఆయన చెంప మీద కొట్టినట్లు తెలుస్తోంది. తర్వాత గోరంట్లను అదుపులోకి తీసుకుని తమ విధులకు ఆటంకం కలిగించారంటూ కేసు నమోదు చేశారు.
News April 11, 2025
NPCILలో 400 పోస్టులు.. నోటిఫికేషన్ విడుదల

ముంబైలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(NPCIL)లో 400 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 30లోగా అప్లై చేసుకోవాలి. బీటెక్ పూర్తిచేసిన వారు అర్హులు. కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ విభాగాల్లో ఉద్యోగాలున్నాయి. గేట్ 2023, 2024, 2025 స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్సైట్: npcilcareers.co.in
News April 11, 2025
అకాల వర్షాలు.. పిడుగులు.. తీవ్ర విషాదం

TG: అకాల వర్షాలకు చేతికొచ్చిన పంట నాశనమవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, జనగామ, సిద్దిపేట, మహబూబ్నగర్, నిర్మల్ జిల్లాల్లో మామిడి కాయలు, వరి, మొక్కజొన్న, మిర్చి, జొన్న పంటలు నేలకూలాయి. ములుగు జిల్లా మెట్లగూడెంలో 15 ఎకరాల పంట నష్టపోవడంతో రైతు నర్సింహారావు పురుగుమందు తాగారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. వేర్వేరు చోట్ల పిడుగులు పడి ముగ్గురు మృతి చెందారు.