News March 27, 2024
హైదరాబాద్లో వర్సిటీకి మహీంద్రా రూ.500 కోట్లు!
హైదరాబాద్లో ఉన్న తమ మహీంద్రా యూనివర్సిటీకి రూ.500 కోట్లు ఇవ్వనున్నట్లు వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ప్రకటించారు. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదలు ఐదేళ్ల పాటు ఈ నిధుల్ని దశలవారీగా వర్సిటీకి అందించాలని తమ కుటుంబం నిర్ణయించిందని తెలిపారు. వర్సిటీ అనుబంధ పాఠశాల ఇందిరా మహీంద్రా స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్కు మరో రూ.50 కోట్లు ఇస్తామన్నారు. మహీంద్రా గ్రూపు వర్సిటీని నాలుగేళ్ల క్రితం హైదరాబాద్లో ఏర్పాటు చేసింది.
Similar News
News October 4, 2024
లడ్డూ వివాదంపై సుప్రీంలో నేడు విచారణ
తిరుమల లడ్డూ వివాదంపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. నిన్ననే విచారణ జరగాల్సి ఉండగా సొలిసిటర్ జనరల్ తుషార్ అభ్యర్థన మేరకు ఇవాళ ఉదయం 10.30 గంటలకు వాదనలు వింటామని ధర్మాసనం తెలిపింది. సిట్ దర్యాప్తును కొనసాగించాలా? లేదా స్వతంత్ర సంస్థలకు అప్పగించాలా? అనేది నేడు న్యాయమూర్తులు తేల్చనున్నారు.
News October 4, 2024
అమరావతి మీదుగా NH-16 విస్తరణ: పెమ్మసాని
AP: కృష్ణా, గుంటూరు జిల్లాలను కలిపే NH-16 అభివృద్ధి ప్రణాళిక బాగుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. వినుకొండ-గుంటూరు 2 లైన్ల మార్గాన్ని 4 లైన్లుగా విస్తరించి మరో 25KM పొడిగించారన్నారు. ఇది రాజధాని అమరావతిని తాకేలా రూపొందిందని, దీనివల్ల ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. దీన్ని పూర్తిగా NHAI నిర్మిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ, విద్యుత్ పనులు చేపడుతుందని తెలిపారు.
News October 4, 2024
మరో 5 భాషలకు క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్
దేశంలోని మరో 5 భాషలకు క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇవ్వాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. మరాఠీ, బెంగాలీ, పాళీ, ప్రాకృత, అస్సామీ భాషలకు ఈ స్థాయిని కల్పించనుంది. దీంతో వీటితో కలిపి దేశంలోని సాంప్రదాయ భాషల సంఖ్య 11కు చేరనుంది. ఇప్పటివరకు తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా భాషలు మాత్రమే ఈ స్టేటస్ను కలిగి ఉన్నాయి.