News April 10, 2025

చంద్రబాబు గారూ.. రొయ్యల రేటు ఎందుకు పెరగడం లేదు?: జగన్

image

AP: సీఎం చంద్రబాబు నిర్వహించే సమావేశాలు ఆక్వా రైతులకు మేలు చేసేలా ఉండాలని YS జగన్ అన్నారు. ‘రొయ్యలకు వేసే మేతపై సుంకం 15% నుంచి 5%కి తగ్గింది. సోయాబీన్‌ రేటు కిలోకు రూ.105 నుంచి రూ.25కి పడిపోయింది. ముడిసరకుల రేట్లు పడిపోయినప్పుడు ఫీడ్‌ రేట్లు ఎందుకు తగ్గడం లేదు? US టారిఫ్స్ వాయిదా పడినా అక్కడికి ఎగుమతయ్యే రొయ్యల ధర ఎందుకు పెరగడం లేదు’ అని సీఎంను ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.

Similar News

News March 21, 2026

మాకు భయపడి రూ.1.21 లక్షల కోట్ల వార్‌షిప్ పారిపోయింది: IRGC

image

తమ దెబ్బకు భయపడి అమెరికన్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ‘గెరాల్డ్’ యుద్ధక్షేత్రం నుంచి వెనక్కి వెళ్లిపోయిందని ఇరాన్ IRGC అధికార ప్రతినిధి తెలిపారు. ‘కేవలం వేల డాలర్ల విలువైన మా స్పీడ్ బోట్లకు 13 బిలియన్ డాలర్ల (రూ.1.21 లక్షల కోట్లు) విలువైన వార్‌షిప్ ఎందుకు భయపడింది? మీరు పేపర్ టైగర్లు మాత్రమే. మా వీరుల పోరాటానికి మీ దగ్గర సమాధానం లేదు. మీరు ఓడిపోయారు. విజయం మాదే’ అని స్పష్టం చేశారు.

News March 20, 2026

ధురంధర్-2తో బాక్సాఫీసు షేక్.. రికార్డులు బ్రేక్!

image

ధురంధర్-2 బాక్సాఫీసు వద్ద రికార్డులు బద్దలు కొడుతోంది. మొదటిరోజే ₹102.55కోట్ల నెట్ సాధించిన ఈ చిత్రం ఒక్క హిందీ వర్షన్‌తోనే ₹99.10Cr రాబట్టింది. బాలీవుడ్ సినిమాల్లో ఇదే అత్యధికం. ప్రపంచవ్యాప్తంగా పుష్ప-2 (₹275.2కోట్లు) తర్వాత బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన రెండో భారతీయ సినిమాగా ధురంధర్-2 (₹236.63Cr) నిలిచింది. పెయిడ్ ప్రివ్యూల్లో OG (₹25కోట్లు)ని బీట్ చేసి ₹43కోట్లు వసూలు చేసింది.

News March 20, 2026

CRDA కొత్త కమిషనర్‌గా విజయరామరాజు

image

AP: రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. సీఆర్‌డీఏ కమిషనర్ కన్నబాబును పౌరసరఫరాల కమిషనర్‌గా నియమించింది. ఆయన స్థానంలో CRDA కమిషనర్‌గా విజయరామరాజు బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక మార్కాపురం కలెక్టర్‌గా విజయ సునీత, పోలవరం కలెక్టర్‌గా దినేశ్ కుమార్ నియమితులయ్యారు.