News April 11, 2025
CID విచారణకు హాజరైన జోగి రమేశ్

AP: వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ సీఐడీ విచారణకు హాజరయ్యారు. 2021లో చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో విచారణ కోసం సీఐడీ కార్యాలయానికి వచ్చారు. దాడి వెనుక ఎవరు ఉన్నారు? ఎవరెవరు వెళ్లారు? వంటి వివరాలను సీఐడీ అధికారులు రాబట్టనున్నారు. కేసుకు సంబంధించిన ఆధారాలు తీసుకురావాలని సీఐడీ ఇటీవల రమేశ్కు నోటీసులు ఇచ్చింది. తొలుత తాడేపల్లి పీఎస్లో నమోదైన ఈ కేసును కూటమి ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది.
Similar News
News April 19, 2026
కాసేపట్లో వర్షం..

TG: సిరిసిల్ల, జగిత్యాల, సంగారెడ్డి జిల్లాల్లో రాబోయే రెండు గంటల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. అలాగే వికారాబాద్, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో సాయంత్రం వానలు పడతాయని చెప్పారు. ఇక హైదరాబాద్లో సాయంత్రం లేదా రాత్రి వర్షం పడొచ్చని పేర్కొన్నారు. అటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు.
News April 19, 2026
మాత్రేకు గాయం.. CSKకు మరో షాక్ తప్పదా?

CSKను గాయాలు వెంటాడుతున్నాయి. ఎల్లిస్, ధోనీ, <<19663724>>ఖలీల్<<>> తర్వాత ఈ జాబితాలో ఆయుష్ మాత్రే చేరినట్లు తెలుస్తోంది. SRHతో మ్యాచులో ఆయన కండరాల గాయంతో ఇబ్బంది పడటంపై బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ స్పందించారు. ‘ఇది కచ్చితంగా తొడ కండరాల్లో చీలిక రావడమే. త్వరలో స్కాన్ చేస్తాం. దురదృష్టవశాత్తూ పరిస్థితి తీవ్రంగానే కనిపిస్తోంది’ అని చెప్పారు. దీంతో మాత్రే కొన్ని మ్యాచులకు దూరం అయ్యే అవకాశం ఉందని క్రీడా వర్గాల అంచనా.
News April 19, 2026
‘ప్రాజెక్ట్ పునర్విక’.. మంత్రి లోకేశ్ కీలక ప్రకటన

AP: అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లలకు వైద్య సాయం అందించేందుకు మంత్రి లోకేశ్ ‘ప్రాజెక్ట్ పునర్విక’ను ప్రకటించారు. చిన్నారి <<19682330>>పునర్వికకు<<>> ₹16Cr ఇంజెక్షన్ ఇస్తుండగా చూడటం తన జీవితంలోని భావోద్వేగ క్షణాల్లో ఒకటని Xలో <


