News April 12, 2025
ఆస్ట్రేలియాలో భారత కాన్సులేట్పై మళ్లీ దాడి

ఆస్ట్రేలియాలోని భారత కాన్సులేట్పై మళ్లీ దాడి జరిగింది. కాన్బెరాలోని రాయబార కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు గ్రాఫిటీతో జాతి విద్వేష నినాదాలను పెయింట్తో రాశారు. గతంలోనూ ఎంబసీపై ఈ దాడులు జరగడం గమనార్హం. అధికారులకు ఫిర్యాదు చేశామని భారత హైకమిషన్ తెలిపింది. దర్యాప్తు చేసి నిందితులపై చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారని వెల్లడించింది.
Similar News
News April 19, 2025
సన్రూఫ్ కార్లపై తగ్గుతున్న ఇంట్రెస్ట్!

సన్రూఫ్ కార్లపై మక్కువ తగ్గిపోతోంది. ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో 78శాతం మంది కార్ల కొనుగోలుదారులు సన్రూఫ్కి బదులుగా వెంటిలేటెడ్ సీట్లున్న కార్ మోడళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తేలింది. సన్రూఫ్ వల్ల ఏడాది పొడవునా వెచ్చగా, సమ్మర్లో మరింత వేడిగా ఉంటోంది. అదే వెంటిలేటెడ్ సీటుతో చల్లగా, వెచ్చగా మార్చుకునే సదుపాయం లభిస్తోంది. వీటిలో మీ ఛాయిస్ దేనికి? COMMENT
News April 19, 2025
అలర్ట్.. ఈ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు

TG: రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల్, ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇతర ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసే అవకాశముందని తెలిపింది.
News April 19, 2025
బంగ్లాదేశ్లో హిందు నేత హత్యను ఖండించిన భారత్

బంగ్లాదేశ్లో హిందూ నాయకుడు భాబేశ్ చంద్ర రాయ్ హత్య పట్ల భారత్ స్పందించింది. యూనుస్ ప్రభుత్వంలో మైనార్టీ హిందువులపై దాడులు క్రమ పద్ధతిన జరుగుతున్నాయని విదేశాంగ శాఖ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ మండిపడ్డారు. మైనార్టీలపై దాడులు చేసిన వారిని శిక్షించలేదని ట్వీట్ చేశారు. దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా గుర్తు తెలియని వ్యక్తులు భాబేశ్ను కిడ్నాప్ చేసి కొట్టి చంపారు.