News March 27, 2024

హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా సానియా మీర్జా?

image

TG: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమె ఎన్నికల బరిలో దిగనున్నట్లు సమాచారం. సానియా లాంటి స్టార్ ఇమేజ్ ఉన్న అభ్యర్థి పోటీ చేస్తే తప్పకుండా ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై ఆ పార్టీ నేతలు సానియాతో చర్చలు జరిపారట. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

Similar News

News March 13, 2026

ప్రతి సినిమాకు సబ్‌టైటిల్స్ కరెక్టేనా.. మీరేమంటారు?

image

అన్ని సినిమాలకు సబ్‌టైటిల్స్, ఆడియో డిస్క్రిప్షన్ తప్పనిసరి చేస్తూ CBFC తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వినికిడి, దృష్టిలోపం ఉన్న వారికి ఇది ఉపయోగపడుతుందని కొందరు సపోర్ట్ చేస్తున్నారు. సబ్‌టైటిల్స్ వల్ల విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ దెబ్బతింటుందని, మూవీని ఎంజాయ్ చేయలేమని మరికొందరు విమర్శిస్తున్నారు. నటుల యాక్టింగ్‌ను కాకుండా అక్షరాలు చూడాల్సి వస్తుందంటున్నారు. మరి మీరేమంటారు?

News March 13, 2026

ఫాంహౌస్ పాలసీ.. వచ్చే అసెంబ్లీలోనే బిల్లు

image

తెలంగాణలో ఫాంహౌస్‌ల నిర్మాణానికి ఓ ప్రత్యేక విధానం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫాంహౌస్‌ల నిర్మాణం చట్టబద్ధం చేయడంతో పాటు అక్రమాలకు అడ్డుకట్ట వేయడం, ఆదాయాన్ని పెంచుకోవడం లక్ష్యంగా ఈ పాలసీని తీసుకురానుందట. విధివిధానాలు రూపొందించి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ పాలసీని ప్రవేశపెట్టాలని చూస్తోంది. కాగా ఆహ్లాదం కోసం, వీకెండ్ సెలవులో నివాసాలను వదిలి ఫాంహౌస్‌లకు చాలామంది వెళ్తుండటం తెలిసిందే.

News March 13, 2026

పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులు జమ

image

AP: PM కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులను సీఎం చంద్రబాబు విడుదల చేశారు. కృష్ణా(D) గన్నవరంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. అర్హులైన రైతుల ఖాతాల్లో రూ.6వేలు చొప్పున జమ చేశారు. PM కిసాన్ కింద రూ.2 వేలు, అన్నదాత సుఖీభవ మూడో విడత కింద రూ.4వేలు.. మొత్తంగా రూ.6వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఈ పెట్టుబడి సాయంతో రాష్ట్ర వ్యాప్తంగా 46.85 లక్షల మంది రైతులకు లబ్ధి కలగనుంది.