News April 14, 2025

రూ.1,800 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

image

గుజరాత్ తీరంలో 300KGల డ్రగ్స్‌ను నార్కోటిక్స్ అధికారులు సీజ్ చేశారు. దీని విలువ ₹1,800Cr ఉంటుందని అంచనా. ఈ నెల 12-13న రాత్రి అనుమానాస్పద బోట్ కనిపించడంతో అధికారులు అక్కడికెళ్లారు. దీంతో దుండగులు డ్రగ్స్‌ మూటలను సముద్రంలో పడేసి ఇంటర్నేషనల్ బోర్డర్ వైపు వెళ్లిపోయారు. వెంటనే సిబ్బంది నీళ్లలో మునిగిన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ ATS, నేవీ దళం సంయుక్త ఆపరేషన్ చేసినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News March 16, 2026

ప్రేయసికి భర్తను ‘లీజు’కు ఇస్తానన్న భార్య.. కానీ!

image

మోసం చేసిన భర్తకు విడాకులు ఇవ్వకుండా అతనిని ప్రేయసికే అద్దెకు ఇవ్వడానికి సిద్ధమైందో భార్య. దీనిద్వారా ఖున్ క్వాంగ్‌ నెలకు ₹85వేలు డిమాండ్ చేసింది. ఈ ఘటన థాయిలాండ్‌లో జరిగింది. వీరికి వివాహమై 10 ఏళ్లయింది. గతేడాది ఓ మహిళతో భర్త అక్రమ సంబంధాన్ని భార్య గుర్తించింది. దీనిపై ప్రశ్నించగా ఇరువురూ విడిచి ఉండలేమన్నారు. దీంతో ఆమె అద్దె ప్రతిపాదన పెట్టగా ప్రేయసి ఒప్పుకుంది. కానీ భర్త అంగీకరించలేదు.

News March 16, 2026

సర్ఫరాజ్ అహ్మద్ రిటైర్మెంట్

image

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇతను కెరీర్‌లో 54 టెస్టులు, 117 వన్డేలు, 61 టీ20లు ఆడారు. 6 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీల సాయంతో 6,164 రన్స్ చేశారు. వికెట్ కీపర్‌గా 315 క్యాచ్‌లు పట్టారు. కెప్టెన్‌గా 2017లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని అందించారు. U-19 సారథిగా 2006లో వరల్డ్ కప్ సాధించారు.

News March 16, 2026

‘మౌంటెడ్ స్ప్రేయర్’తో ఎరువుల పిచికారీ సులభం

image

అందుబాటులోకి వస్తున్న ఆధునిక పరికరాలు సాగులో రైతు శ్రమను తగ్గిస్తున్నాయి. ప్రస్తుతం చాలా మంది రైతులు ‘మౌంటెడ్ స్ప్రేయర్’ అనే పరికరాన్ని వాడుతున్నారు. దీన్ని ట్రాక్టరుకు బిగించి ద్రవరూపంలో ఎరువులను పిచికారీ చేస్తున్నారు. దీంతో తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో రోజుకు 20 ఎకరాల వరకు స్ప్రే చేయవచ్చు. దీన్ని వాడటం వల్ల కూలీల కొరతను అధిగమించడంతో పాటు మొక్కలకు కూడా సమపాళ్లలో ఎరువులు, మందులను అందించవచ్చు.