News April 14, 2025
రూ.1,800 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

గుజరాత్ తీరంలో 300KGల డ్రగ్స్ను నార్కోటిక్స్ అధికారులు సీజ్ చేశారు. దీని విలువ ₹1,800Cr ఉంటుందని అంచనా. ఈ నెల 12-13న రాత్రి అనుమానాస్పద బోట్ కనిపించడంతో అధికారులు అక్కడికెళ్లారు. దీంతో దుండగులు డ్రగ్స్ మూటలను సముద్రంలో పడేసి ఇంటర్నేషనల్ బోర్డర్ వైపు వెళ్లిపోయారు. వెంటనే సిబ్బంది నీళ్లలో మునిగిన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ ATS, నేవీ దళం సంయుక్త ఆపరేషన్ చేసినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News February 11, 2026
తిరుమల కొండపై పూలు ఎందుకు ధరించరు?

శ్రీవారు అలంకార ప్రియుడు. కొండపై పూసే ప్రతి పువ్వు స్వామివారికే చెందాలనేది భక్తుల విశ్వాసం. పూర్వం ఓ శిష్యుడు దేవుడికి అర్పించాల్సిన పూలను తాను ధరించాడు. అలా ‘పరిమళ ద్రోహం’ చేసినట్లు పురాణ గాథ. అందుకే, అప్పటి నుంచి భక్తులు కొండపై పూలు పెట్టుకోకూడదనే నియమం వచ్చింది. స్వామికి అలంకరించిన పూలను కూడా ఇతరులకు ఇవ్వకుండా పవిత్రమైన బావిలోనే వేస్తారు. ఈ నియమం పాటించడం స్వామివారిపై ఉన్న భక్తికి నిదర్శనం.
News February 11, 2026
RRBలో జూనియర్ ఇంజినీర్ పోస్టులు.. సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు విడుదల

<
News February 11, 2026
కోళ్లకు వ్యాధుల ముప్పు తగ్గాలంటే?

ఏదైనా కోడిలో వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే మిగిలిన కోళ్ల నుంచి దాన్ని వేరుచేయాలి. వ్యాధితో ఏదైనా కోడి చనిపోతే దాన్ని దూరంగా లోతైన గుంతలో పూడ్చిపెట్టాలి లేదా కాల్చేయాలి. కోళ్ల షెడ్డులోకి వెళ్లేవారు నిపుణులు సూచించిన క్రిమిసంహారక ద్రావణంలో కాళ్లు కడుక్కున్న తర్వాతే వెళ్లాలి. కోడికి మేతపెట్టే తొట్టెలు, నీటితొట్టెలను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి. షెడ్డులో లిట్టరును గమనిస్తూ అవసరమైతే మారుస్తుండాలి.


