News April 14, 2025

ఏపీలో రూ.5,001 కోట్లతో LG కొత్త ప్లాంట్!

image

AP: తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో LG కంపెనీ కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది. మే 8న దీని ఓపెనింగ్ సెర్మనీ ఉండే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం గతేడాది NOVలో 247 ఎకరాలను కేటాయించింది. రూ.5,001 కోట్ల పెట్టుబడులను ఆమోదించింది. ఈ ప్లాంటులో ఫ్రిజ్‌లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు, టీవీలు, కంప్రెషర్లను తయారు చేయనున్నారు. 1,495 మంది స్థానికులకు ప్రత్యక్ష ఉపాధి కల్గనుంది.

Similar News

News March 12, 2026

కొత్త ఏడాది ఏ రాశి వారికి ఎలా ఉందంటే?

image

ఈనెల 19న చైత్ర శుద్ధ పాడ్యమి రోజున తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ‘శ్రీ పరాభవ నామ’ సంవత్సరంలో అన్ని రాశుల ఆదాయ వ్యయాలు, రాజపూజ్య, అవమానాల పంచాగాన్ని ‘భక్తి’ టీవీ విడుదల చేసింది. ముఖ్యంగా మిథున రాశివారికి ఆదాయం కంటే వ్యయం & రాజ్య పూజ్యం కంటే అవమానాలే ఎక్కువగా ఉంటాయని పండితులు తెలిపారు. సింహ రాశి వారికి అన్నీ సరిసమానంగా ఉంటాయని చెప్పారు. మీ రాశి ఏంటో కామెంట్ చేసి షేర్ చేయండి.

News March 12, 2026

ఫిరాయింపుల కేసు.. విచారణ ముగించిన సుప్రీంకోర్టు

image

TG: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో BRS పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ ముగించింది. అసెంబ్లీ స్పీకర్ ఇప్పటికే పిటిషన్లను పరిష్కరించారని న్యాయవాది సింఘ్వీ కోర్టుకు తెలిపారు. ఈ మేరకు విచారణ ముగిసినట్లు జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం ప్రకటించింది. 2 రోజుల్లో స్పీకర్ తన తీర్పు కాపీలను ఫిర్యాదుదారులకు ఇవ్వాలని ఆదేశించింది. కాగా స్పీకర్ ప్రసాద్ 10 మందికి MLAకు <<19352106>>క్లీన్‌చిట్<<>> ఇచ్చిన సంగతి తెలిసిందే.

News March 12, 2026

నిరుద్యోగులకు అలర్ట్.. ఏడాదికి 2 సార్లే..

image

TGPSC వన్‌టైం రిజిస్ట్రేషన్ (OTR) విధానంలో మార్పులు చేసింది. ఏడాదిలో రెండుసార్లు మాత్రమే OTRలో మార్పులు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ప్రతి ఏడాది జనవరి, జూన్ నెలల్లో వారం నుంచి 10 రోజుల పాటు ఓటీఆర్ అప్‌డేట్ విండోను అందుబాటులో ఉంచుతారు. ఆ సమయంలో అదనపు విద్యార్హతలను, ఇతర మార్పులను నమోదు చేసుకోవచ్చు. ఇప్పటికే ఓటీఆర్‌లో అదనపు అర్హతలు నమోదు చేసుకోని వారు, ఈనెల 25లోగా చేసుకోవాలని కమిషన్ సూచించింది.