News March 27, 2024

పెద్దిరెడ్డికి ఇసుకే టిఫిన్.. మైన్స్ మధ్యాహ్న భోజనం: CBN

image

AP: బాబాయిని గొడ్డలితో చంపిన వ్యక్తులతో జగన్ తిరుగుతున్నారని మదనపల్లె ప్రజాగళం సభలో చంద్రబాబు ఆరోపించారు. ‘మంత్రి పెద్దిరెడ్డికి ఇసుకే ఉదయం అల్పాహారం. మైన్స్ మధ్యాహ్న భోజనం. అన్నమయ్య జిల్లాలో పాపాల పెద్దిరెడ్డి పాలన సాగుతోంది. కాంట్రాక్టులన్నీ ఆయనే తీసుకుని, ఇసుకను అక్రమంగా బెంగళూరుకు తరలిస్తున్నారు. రౌడీయిజం కావాలో? ప్రజాస్వామ్యం కావాలో? ప్రజలే తేల్చుకోవాలి’ అని చంద్రబాబు అన్నారు.

Similar News

News March 23, 2026

నేడు షాహీద్ దివస్.. అమరవీరులకు జోహార్లు!

image

దేశ స్వాతంత్ర్య సమరంలో భగత్ సింగ్‌ది ప్రత్యేక స్థానం. లాలాలజపతి రాయ్ మరణించడం భగత్ సింగ్ పోరాటానికి ఆజ్యం పోసింది. తన స్నేహితులు సుఖ్‌దేవ్, రాజ్‌గురులతో కలిసి లాల మరణానికి కారణమైన జేమ్స్ స్కాట్‌ను చంపే క్రమంలో పొరపాటున జాన్ సౌండర్స్ అనే మరో ఆఫీసర్‌ను హతమార్చుతారు. ఈ కేసుపైనే బ్రిటిషర్లు వీరిని అరెస్ట్ చేసి 1931 MAR 23న ఉరి తీశారు. వీరి పోరాటానికి నివాళిగా ఏటా ఈరోజును షాహీద్ దివస్‌గా జరుపుకుంటాం.

News March 23, 2026

ఇవాళ ‘వాహన్’ పోర్టల్‌లోకి TG ఎంట్రీ

image

TG: కేంద్ర పరిధిలోని ‘వాహన్’ పోర్టల్‌తో రాష్ట్ర వాహనాల డేటా ఇవాళ అనుసంధానం కానుంది. ఈ సేవలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. ఇకపై రిజిస్ట్రేషన్, వెహికల్ ఓనర్ అడ్రస్, పేరు మార్పు, RC డూప్లికేట్, పన్ను చెల్లింపు వంటి సేవలన్నీ ఆన్‌లైన్‌కు మారనున్నాయి. RTA ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. అలాగే ఒకే పేరుపై <<19443159>>రెండో వాహనం<<>> కొంటే అదనంగా కట్టాల్సిన 2% లైఫ్ ట్యాక్స్‌ నేటి నుంచి రద్దవనుంది.

News March 23, 2026

షాకింగ్.. మాజీ ఎమ్మెల్యేపై కుల బహిష్కరణ

image

21వ శతాబ్దంలోనూ కుల జాడ్యం కొనసాగుతోంది. ఇందుకు సామాన్యులే కాకుండా ప్రజాప్రతినిధులూ బలవుతున్నారు. తాజాగా ఒడిశాలో వేరే సామాజికవర్గం యువకుడితో కూతురి నిశ్చితార్థం చేసిన నవరంగపూర్ EX MLA సదాశివ ప్రధాన్ కుల బహిష్కరణకు గురయ్యారు. ఆయన కుటుంబాన్ని 12ఏళ్లపాటు వెలివేస్తున్నట్లు ఆల్ ఇండియా భత్రా డెవలప్‌మెంట్ కౌన్సిల్ ప్రకటించింది. సామాజిక, సాంస్కృతిక, ఇతర ఫ్యామిలీ వేడుకల్లో ఎవరూ పాల్గొనవద్దని ఆదేశించింది.