News March 28, 2024

2019లో భారీ మెజార్టీ.. ఇప్పుడు ఆత్మహత్య

image

తమిళనాడులోని ఈరోడ్ ఎంపీ గణేశమూర్తి(77) <<12940065>>ఆత్మహత్య<<>> ఆ రాష్ట్రంలో తీవ్ర విషాదాన్ని నింపింది. 2019 ఎన్నికల్లో ఆయన DMK నుంచి పోటీ చేసి 2.10 లక్షల మెజార్టీతో ఘన విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై పురుగు మందు తాగారు. నాలుగు రోజులుగా ప్రాణాలతో పోరాటం చేసి ఇవాళ గుండె పోటుతో తుది శ్వాస విడిచారు. వివాద రహితుడు, సౌమ్యుడిగా ఆయనకు పేరుంది.

Similar News

News March 18, 2026

రేణు దేశాయ్‌పై అసభ్య పోస్టులు.. ఇద్దరి అరెస్ట్

image

నటి రేణు దేశాయ్‌పై సోషల్ మీడియాలో <<19265289>>అసభ్యకర పోస్టులు<<>> పెట్టిన ఇద్దరు వ్యక్తులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అశ్లీల పదజాలంతో వేధిస్తున్నారని ఇటీవల 4 SM అకౌంట్లపై రేణు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఇద్దరిని పోలీసులు పట్టుకోగా, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. SMలో వేధించే కేటుగాళ్లను వదిలిపెట్టబోమని పోలీసులు హెచ్చరించారు. బాధితులు తమను సంప్రదించాలని సూచించారు.

News March 18, 2026

మార్చి 18: చరిత్రలో ఈ రోజు

image

*1871: భారత సంతతికి చెందిన గణిత, తర్క శాస్త్రవేత్త అగస్టస్ డీ మోర్గాన్ మరణం
*1922: శాసనోల్లంఘన ఉద్యమం చేసినందుకు మహాత్మా గాంధీకి 6 ఏళ్ల జైలు శిక్ష
*1938: బాలీవుడ్ నటుడు శశి కపూర్ జననం
*1965: అంతరిక్షంలో నడిచిన తొలి రోదసీ యాత్రికుడిగా అలెక్సీ లియనోవ్ రికార్డు
*1998: భారత ప్రధానమంత్రిగా ఐ.కె.గుజ్రాల్ పదవీ విరమణ (ఫొటోలో)

News March 18, 2026

పవిత్ర కార్యాన్ని BR నాయుడు నిర్వహించడమా: YCP

image

AP: తిరుమల పవిత్రత విషయంలో రాజీపడకూడదని YCP పేర్కొంది. ‘ఇటీవల <<19271324>>బయటికొచ్చిన<<>> వీడియో TTD ఛైర్మన్ BR నాయుడు ప్రవర్తనపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. ఈ ఆరోపణలను విస్మరించలేం. అలాంటిది తిరుమలలో పవిత్ర కోయిల్ అళ్వార్ తిరుమంజనం కార్యాన్ని ఆయన నిర్వహించారు. ఆరోపణలు తేలకుండానే ఇందులో పాల్గొనడం ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. BR నాయుడు పదవి నుంచి వైదొలగాలి’ అని ట్వీట్ చేసింది.