News March 28, 2024
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు కస్టడీ

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు కోర్టు కస్టడీ విధించింది. అడిషనల్ ఎస్పీ తిరుపతన్న, భుజంగరావుకు 5 రోజుల కస్టడీ విధిస్తూ నాంపల్లి కోర్టు అనుమతిచ్చింది. కానీ ప్రణీత్ రావు కస్టడీకి కోర్టు అనుమతించలేదు. కాగా నిందితులంతా తమ సొంత అవసరాలకు కూడా ఫోన్ ట్యాపింగ్ వాడుకున్నట్లు తెలుస్తోంది. వ్యాపారవేత్తలు, హవాలా దందా చేసేవారిని బెదిరించి డబ్బులు తీసుకున్నట్లు సమాచారం.
Similar News
News November 6, 2025
మొత్తానికి ట్రంప్కు పీస్ ప్రైజ్ వచ్చేస్తోంది!

తరచూ ఏదో ఓ ప్రకటనతో ప్రపంచానికి మనశ్శాంతి దూరం చేస్తున్న ట్రంప్కు ఎట్టకేలకు శాంతి బహుమతి రానుంది. నోబెల్ NO అన్న అమెరికా పెద్దన్నను అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య ఆదుకుంటోంది. వాషింగ్టన్లో వరల్డ్ కప్ డ్రా వేదికపై ఈ సారి కొత్తగా FIFA Peace Prize ఇస్తామని ప్రకటించింది. FIFA చీఫ్ గయానీ ఫుట్బాల్-పీస్ రిలేషన్ను అతికిస్తూ వివరించిన ప్రయత్నం చూస్తుంటే ఇది తన శాంతి కోసమే అన్పిస్తోంది.
News November 6, 2025
MOILలో 99 ఉద్యోగాలు

మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్(<
News November 6, 2025
‘బాహుబలి-ది ఎపిక్’.. రూ.50 కోట్లు దాటిన కలెక్షన్లు!

బాహుబలి-ది ఎపిక్ సినిమా కలెక్షన్లు రూ.50 కోట్లు దాటినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. 6 రోజుల్లో దాదాపు రూ.53 కోట్ల వరకు గ్రాస్ వచ్చినట్లు పేర్కొన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.20 కోట్లకు పైగా, కర్ణాటకలో రూ.5 కోట్లు, విదేశాల్లో రూ.12 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం వసూళ్లు రూ.60 కోట్లు దాటొచ్చని అంచనా వేస్తున్నారు.


