News March 28, 2024
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు కస్టడీ
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు కోర్టు కస్టడీ విధించింది. అడిషనల్ ఎస్పీ తిరుపతన్న, భుజంగరావుకు 5 రోజుల కస్టడీ విధిస్తూ నాంపల్లి కోర్టు అనుమతిచ్చింది. కానీ ప్రణీత్ రావు కస్టడీకి కోర్టు అనుమతించలేదు. కాగా నిందితులంతా తమ సొంత అవసరాలకు కూడా ఫోన్ ట్యాపింగ్ వాడుకున్నట్లు తెలుస్తోంది. వ్యాపారవేత్తలు, హవాలా దందా చేసేవారిని బెదిరించి డబ్బులు తీసుకున్నట్లు సమాచారం.
Similar News
News January 14, 2025
రైతులకు గుడ్ న్యూస్.. కూరగాయల సాగుకు సబ్సిడీ!
TG: కూరగాయలు సాగు చేసే రైతులు శాశ్వత పందిళ్లు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకునేందుకు సాయపడాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాశ్వత పందిళ్లకు ఎకరానికి ₹3లక్షలు ఖర్చు కానుండగా, అందులో 50% సబ్సిడీ ఇవ్వనుంది. ఈ స్కీమ్ను తొలుత NZB(D) బోధన్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. తీగ జాతి కూరగాయల సాగుకు ప్రాధాన్యం ఉంటుంది. ఈ స్కీమ్ అమలుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ నిధులను వినియోగించనున్నట్లు సమాచారం.
News January 14, 2025
టిక్టాక్ను మస్క్కు అమ్మనున్న చైనా?
అమెరికాలో టిక్టాక్ను బ్యాన్ చేస్తే ఏం చేయాలన్న దానిపై బైట్డాన్స్ మల్లగుల్లాలు పడుతోంది. ఆ దేశం వరకు వ్యాపారాన్ని ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్కు అమ్మడాన్ని ఒక ఆప్షన్గా ఎంచుకున్నట్టు తెలిసింది. విషయం అంత వరకు రాకుండా డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్తో చర్చించేందుకు సిద్ధమవుతోందని సమాచారం. వారెలాంటి రూల్స్ పెట్టినా పాటించేందుకు సై అంటోంది. టిక్టాక్ బ్యాన్కు ట్రంప్ అనుకూలంగా ఉండటం గమనార్హం.
News January 14, 2025
భార్యలతో స్టేయింగ్ టైమ్ కుదించిన BCCI?
టీమ్ఇండియా వరుస వైఫల్యాల నుంచి BCCI మేలుకుంటోంది. క్రికెటర్లపై కఠిన ఆంక్షల అమలుకు సిద్ధమవుతోందని సమాచారం. జట్టులో VVIP కల్చర్ను తగ్గించేందుకు ఇకపై అందరూ టీమ్బస్సులోనే ప్రయాణించాలని ఆదేశించింది. భార్యాపిల్లలతో స్టేయింగ్ను చిన్న టోర్నీలప్పుడు 7, పెద్ద టోర్నీలప్పుడు 14 రోజులకు కుదించినట్టు తెలిసింది. ఆటగాళ్ల బ్యాగేజ్ 150KG కన్నా ఎక్కువ ఉండకూడదు. గౌతీ మేనేజర్ VIP BOXలో ఉండకూడదు. మీ కామెంట్.