News March 29, 2024
జగన్ 30 ఏళ్ల పాటు పాలన చేస్తారు: ముద్రగడ

AP: వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 30 ఏళ్ల పాటు జగన్ పాలన చేస్తారని జోస్యం చెప్పారు. సీఎం ఆదేశాలతో ఇకపై ఎలాంటి ఉద్యమాలు ఉండవన్నారు. పిఠాపురంలో పవన్ ఓటమి ఖాయమని చెప్పారు. ఈ ఎన్నికల్లో ప్రజలు జనసేన పార్టీని ప్యాక్ చేస్తారన్నారు. పవన్ కంటే చిరంజీవి చాలా బెటర్ అని అన్నారు.
Similar News
News April 1, 2026
AIతో జాబ్ పోయిందని భర్త ఆత్మహత్య.. 18వ ఫ్లోర్ నుంచి దూకేసిన భార్య

బెంగళూరులో భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటనలో కొత్త విషయాలు బయటకు వచ్చాయి. సిద్దిపేట జిల్లాకు చెందిన భానుచందర్ రెడ్డి AI కారణంగా గతేడాది ఉద్యోగం కోల్పోవడంతో అమెరికా నుంచి వచ్చేశారు. భార్య షాజియాతో కలిసి బెంగళూరులో నివసిస్తున్నారు. జాబ్ పోవడంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఆయన సోమవారం ఉరేసుకున్నాడు. అది తట్టుకోలేని భార్య 20 నిమిషాల్లోనే 18వ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
News April 1, 2026
యంగ్ హీరోలతో బాలయ్య పోటీ.. మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్!

బాలకృష్ణ వరుసగా సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో మూవీ చేస్తుండగా, ఆ తర్వాత వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దసరాకు షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలాగే విజయ్ కనకమేడల చెప్పిన కథకూ బాలయ్య ఓకే చెప్పినట్లు సమాచారం. ఇది 2027 ఆరంభంలో పట్టాలెక్కనుందని టాక్. నాంది, భైరవం, ఉగ్రం చిత్రాలకు విజయ్ డైరెక్షన్ చేశారు.
News April 1, 2026
GK: భారతీయ రైల్వే – కీలక విషయాలు

*మొదటి రైలు: భారతదేశంలో మొదటి రైలు ఏప్రిల్ 16, 1853న ముంబై (బోరి బందర్) నుంచి థానే వరకు (34 కి.మీ) నడిచింది.
*రైల్వే జోన్లు: ప్రస్తుతం 19 రైల్వే జోన్లు ఉన్నాయి (మెట్రో రైల్ కోల్కతాతో కలిపి).
*అతి పొడవైన రైలు మార్గం: వివేక్ ఎక్స్ప్రెస్ – ఇది దిబ్రూగఢ్ (అస్సాం) నుండి కన్యాకుమారి (తమిళనాడు) వరకు ప్రయాణిస్తుంది.
*మొదటి విద్యుత్ రైలు: 1925లో ముంబై నుండి కుర్లా మధ్య నడిచిన డెక్కన్ క్వీన్.


