News March 29, 2024
హైదరాబాద్: భయపెడుతున్న‘భువన్’ సర్వే!

భువన్ సర్వే పేరుతో ఆస్తిపన్ను మదింపు చేయించిన మున్సిపల్ అధికారులు ఆ సర్వే ప్రకారం ఇళ్ల విస్తీర్ణం ఆధారంగా పన్ను జారీ చేస్తున్నారు. పంచాయతీలుగా ఉన్నప్పటి పన్నుల ప్రకారం లెక్కగట్టి కొంతమేరకు పెంచితే సరిపోతుంది. ఇందుకు విరుద్ధంగా జవహర్నగర్, బడంగ్పేట, మీర్పేట్, నిజాంపేట్, బోడుప్పల్, పీర్జాదీగూడ కార్పొరేషన్లలో ఇంటి పన్నులు పెంచి ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News January 15, 2026
HYD: ట్రాకులు రెడీ అవ్వకముందే రైళ్ల ఆర్డర్

సాధారణంగా మెట్రో స్టేషన్లు అన్నీ కట్టాక రైళ్లు కొంటారు. కానీ, మన అధికారులు మాత్రం పని మొదలవ్వకముందే 60 కొత్త కోచ్ల కోసం జనవరి 14న టెండర్లు పిలిచారు. దీన్నే “జంప్-స్టార్ట్” ప్లాన్ అంటున్నారు. ఎందుకంటే రైళ్లు రావడానికి రెండేళ్లు పడుతుంది, అందుకే ట్రాకులు తయారయ్యే లోపే రైళ్లను ప్లాట్ఫామ్ మీద ఉంచాలని ఈ ముందస్తు ప్లాన్ వేశారు. ఇందులో కెమెరాలు, సెన్సార్లు కూడా అదిరిపోయే రేంజ్లో ఉంటాయట.
News January 15, 2026
ఓల్డ్ సిటీ మెట్రో ముచ్చట.. ఇల్లు పోయినా ‘పై అంతస్తు’ ఆశ!

దారుల్షిఫా నుంచి చాంద్రాయణగుట్ట దాకా సుమారు 450 ఇళ్లు, షాపులను కూల్చేయడానికి సర్కారు మార్కింగ్ ఇచ్చేంది. ఇల్లు పోతుందని బాధపడే వాళ్ల కోసం ప్రభుత్వం ఆఫర్ ఇచ్చింది. ఇల్లు కొంచెం పోయినా పైన రెండు అంతస్తులు ఎక్స్ట్రా కట్టుకోవడానికి ఫ్రీగా పర్మిషన్ ఇస్తారట. ఇక L&T, ప్రభుత్వానికి మధ్య జరిగిన డీల్ చూస్తే మతిపోవాల్సిందే. అప్పులన్నీ ప్రభుత్వం నెత్తిన, మెట్రో మాల్స్ మీద వచ్చే లాభాలు ఆ కంపెనీ తీసుకుంటుందట.
News January 15, 2026
HYDలో పోగులేస్తే మటన్కు ఎంత ఖర్చంటే!

సంక్రాంతి పండుగ వేళ ప్రతి ఇంట్లో తునకలు ఉడకాల్సిందే. మటన్ కిలో రూ.1,000 దాటడంతో సామాన్యులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టారు. 5- 6 కుటుంబాలు కలిసి ఓ మేకను కొని మాంసాన్ని కుప్పలుగా విభజించుకుంటున్నారు. దీంతో ఒక్కో ఫ్యామిలీకి రూ.1,400 వరకు ఖర్చైనా 2KG వరకు మటన్ వస్తుండటంతో ఈ విధానానికి ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. ఘట్కేసర్, మెట్, IBP తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం పోగుల పంపకాలు జోరుగా సాగుతున్నాయి.


