News March 29, 2024
హింసాత్మక చిత్రాలు చూడను.. నటిస్తా: ఆండ్రియా

కోలీవుడ్ హీరోయిన్ ఆండ్రియా జెర్మియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను హారర్, హింసాత్మక చిత్రాలు చూడనని, కానీ అలాంటి సినిమాల్లో నటిస్తానని చెప్పారు. చూడటం వేరు.. నటించడం వేరని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె తమిళంలో కా- ది ఫారెస్ట్, పిశాచి-2, నో ఎంట్రీ తదితర మూవీల్లో నటిస్తున్నారు. ఇటీవలే తెలుగులో ‘సైంధవ్’లో కీలక పాత్ర పోషించారు. ఆమె డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్గానూ రాణిస్తున్నారు.
Similar News
News November 8, 2025
ఘోర ప్రమాదం.. కారు ఎలా ధ్వంసమైందో చూడండి!

UPలోని షమ్లీలో జరిగిన రోడ్డు ప్రమాద దృశ్యాలు వైరల్గా మారాయి. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును స్విఫ్ట్ కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని నలుగురు కజిన్ బ్రదర్స్ చనిపోగా, ఒకరికి రేపు పెళ్లి కావాల్సి ఉంది. ఘటన జరిగినప్పుడు కారులోని భాగాలు 100M దూరంలో పడ్డాయి. వాహనం నామ రూపాల్లేకుండా మారడంపై SMలో చర్చ జరుగుతోంది. కొన్నికార్లలో సేఫ్టీ అధ్వానంగా ఉన్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
News November 8, 2025
న్యూస్ రౌండప్

▶ బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీని కలిసిన PM మోదీ. అద్వానీ పుట్టినరోజు సందర్భంగా విషెస్
▶ USలో అనారోగ్యంతో APలోని కారంచేడుకు చెందిన విద్యార్థిని రాజ్యలక్ష్మి(23) మృతి
▶ UPA హయాంలో 88వేల మంది అక్రమ వలసదారులను తిప్పి పంపామన్న కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్
▶ బిహార్ ఎన్నికల వేళ అన్నదమ్ములు తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ మధ్య ముదిరిన వైరం.. సోదరుడితో ఇక ఎన్నటికీ బంధం ఉండదన్న తేజ్ ప్రతాప్
News November 8, 2025
త్వరలోనే మహిళలకు రూ.2,500: జగ్గారెడ్డి

TG: వృద్ధులకు రూ.4వేల పెన్షన్, మహిళలకు రూ.2,500 సాయం అందించే పథకాలు త్వరలోనే అమలు అవుతాయని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తెలిపారు. ఇందుకు త్వరలోనే ముహూర్తం ఖరారు అవుతుందన్నారు. ఈ స్కీముల అమలుకు సీఎం రేవంత్ ఆలోచన చేస్తున్నారని, నిధులు సమకూర్చుకునే పనిలో ఉన్నారని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించాలని మీడియా సమావేశంలో ఓటర్లకు పిలుపునిచ్చారు.


