News March 29, 2024
హింసాత్మక చిత్రాలు చూడను.. నటిస్తా: ఆండ్రియా
కోలీవుడ్ హీరోయిన్ ఆండ్రియా జెర్మియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను హారర్, హింసాత్మక చిత్రాలు చూడనని, కానీ అలాంటి సినిమాల్లో నటిస్తానని చెప్పారు. చూడటం వేరు.. నటించడం వేరని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె తమిళంలో కా- ది ఫారెస్ట్, పిశాచి-2, నో ఎంట్రీ తదితర మూవీల్లో నటిస్తున్నారు. ఇటీవలే తెలుగులో ‘సైంధవ్’లో కీలక పాత్ర పోషించారు. ఆమె డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్గానూ రాణిస్తున్నారు.
Similar News
News January 22, 2025
నేను ఇంకా క్రికెట్ ఆడొచ్చేమో: డివిలియర్స్
తాను ఇంకా క్రికెట్ ఆడొచ్చేమో అనే అనుభూతి చెందుతున్నట్లు డివిలియర్స్ చెప్పారు. బంతిని ఊచకోత కోసే ఇతను గ్రౌండ్లోకి అడుగుపెట్టాలనే నిర్ణయంతోనే ఇలా హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘నా కళ్లు ఇంకా పని చేస్తున్నాయి. గ్రౌండ్కు వెళ్లి బంతులను కొడుతూ మళ్లీ క్రికెట్ను ఎంజాయ్ చేస్తున్నట్లు ఫీల్ అవుతున్నా’ అని చెప్పారు. దీంతో త్వరగా రీఎంట్రీ ఇవ్వాలని ఏబీ ఫ్యాన్స్ SMలో కామెంట్లు పెడుతున్నారు.
News January 22, 2025
నేడే ఇంగ్లండ్తో తొలి T20.. కళ్లన్నీ షమీపైనే
స్వదేశంలో ఇంగ్లండ్తో 5T20ల సిరీస్లో భాగంగా నేడు భారత్ తొలి T20 కోల్కతాలో ఆడనుంది. SKY సారథ్యంలో ధనాధన్ ఆటకు జట్టు సిద్ధమైన వేళ స్టార్ పేసర్ షమీపైనే కళ్లన్నీ ఉన్నాయి. గాయం నుంచి కోలుకొని జట్టులో చేరిన షమీ ఆశించిన స్థాయిలో రాణిస్తే CTలో భారత్కు ఎక్స్ఫ్యాక్టర్గా మారనున్నారు. అటు విజయంతో సిరీస్ ప్రారంభించాలని ఇంగ్లండ్ వ్యూహాలు రచిస్తోంది. రాత్రి 7 గం.కు స్టార్ స్పోర్ట్స్లో మ్యాచ్ లైవ్ చూడవచ్చు.
News January 22, 2025
27మంది మావోలు మృతి.. మృతుల్లో అలిపిరి దాడి సూత్రధారి
ఛత్తీస్గఢ్- ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో 27మంది మావోయిస్టులు చనిపోగా, వారిలో ఆ పార్టీ కేంద్ర కమిటీ పొలిట్బ్యూరో సభ్యుడు చలపతి(60) ఉన్నారు. ఇతను ఏపీ సీఎం చంద్రబాబుపై జరిగిన అలిపిరి దాడిలో కీలక సూత్రధారి. ఈయనది చిత్తూరు జిల్లా మాటెంపల్లి కాగా, రూ.కోటి రివార్డ్ ఉంది. చలపతి వద్ద ఎప్పుడూ ఏకే 47, ఎస్ఎల్ఆర్ వెపన్స్ ఉంటాయని, చుట్టూ 8- 10 మంది మావోలు సెక్యూరిటీ ఉంటారని సమాచారం.