News March 29, 2024
బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటింగ్.. స్పందించిన ఈసీ!

మరికొన్ని రోజుల్లో జరిగే లోక్సభ ఎన్నికల్లో ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. ఛత్తీస్గఢ్లోని వార్తాపత్రికల్లో దీనిపై కథనాలు రావడంతో ఓటర్లలో గందరగోళం ఏర్పడింది. ఈక్రమంలో దీనిపై ఎన్నికల సంఘం స్పందించింది. ఈ వార్తలు ఫేక్ అని, ఇలాంటి నిరాధారమైన వాటిని నమ్మొద్దని పేర్కొంది. అలాంటి ఆదేశాలివ్వలేదని ఈసీ వెల్లడించింది.
Similar News
News April 2, 2026
ఒరాకిల్లో వారి ఉద్యోగాలే పోయాయా?

ఒరాకిల్ లేఆఫ్స్పై ఓ మాజీ ఉద్యోగిని చేసిన లింక్డిన్ పోస్ట్ ఐటీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. 34 ఏళ్లుగా కంపెనీలో పనిచేస్తున్న నీనా లూయిస్ 30 వేల మందిని తొలగించడంపై షాకింగ్ ఆరోపణ చేశారు. ఈ తొలగింపులు యాదృచ్ఛికంగా జరగలేదని.. ఒక ‘అల్గారిథమ్’ ఉందని ఆరోపించారు. ముఖ్యంగా కంపెనీలో ఎక్కువ స్టాక్ ఆప్షన్స్ ఉండి, అధిక జీతం తీసుకునే సీనియర్స్ను, మిడ్-లెవల్ మేనేజర్లనే టార్గెట్ చేసినట్లు తెలిపారు.
News April 2, 2026
మీ రుణం తీర్చుకోలేం: అమరావతి మహిళలు

AP: అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును పార్లమెంటు ఆమోదించడంతో ఏపీలో సంబరాలు అంబరాన్నంటాయి. ఉద్ధండరాయునిపాలెం సభలో CBN, ఆయన సతీమణి భువనేశ్వరి పాల్గొన్నారు. CBN ప్రసంగం సహా సభ అంతా ఉద్వేగభరితంగా సాగింది. ముఖ్యంగా సుదీర్ఘ పోరాటం చేసిన మహిళలు సభ అనంతరం CM దంపతులకు భావోద్వేగంతో ధన్యవాదాలు తెలిపారు. ‘ఈ జన్మకు ఇది చాలు సార్. మా బతుకులు నిలబెట్టారు. ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేం’ అని అన్నారు.
News April 2, 2026
రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు.. మంత్రి కీలక ప్రకటన

TG: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెలాఖరులో రెండో విడత లబ్ధిదారుల ఎంపికను ప్రారంభిస్తామని చెప్పారు. ఇది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. కాగా ఇప్పటికే మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున కేటాయించారు. అటు రంగారెడ్డి జిల్లా ఆమనగల్లో భూభారతి పోర్టల్ను మంత్రి ప్రారంభించారు.


