News March 29, 2024
పాడేరులో సీనియర్లను కాదని..

AP: అల్లూరి జిల్లా పాడేరులో సీనియర్ నేతలను కాదని కిల్లు వెంకటరమేశ్కి టీడీపీ టికెట్ ఇచ్చింది. ఆయన పాడేరు మాజీ సర్పంచ్ వెంకటరత్నం కుమారుడు. టీచర్గా రాజీనామా చేసి ఇటీవల TDPలో చేరారు. ఈ సీటు కోసం Ex MLA గిడ్డి ఈశ్వరి, మాజీ మంత్రి మణికుమారి, ZP మాజీ ఛైర్పర్సన్ కాంతమ్మ, నాగరాజు ప్రయత్నించారు. కాగా ఇక్కడ చివరిగా 1999లో టీడీపీ గెలిచింది. మరి కొత్త అభ్యర్థి రాకతో ఇక్కడ TDP జెండా ఎగురుతుందేమో చూడాలి.
Similar News
News March 21, 2026
YELLOW ALERT: రేపు ఈ జిల్లాల్లో వర్షాలు!

TG: రాష్ట్రంలో 2 రోజులు అక్కడక్కడా మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ రెండు రోజులు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు తక్కువగా ఉండే ఛాన్స్ ఉందంది. ఆ తర్వాత 3 రోజుల్లో క్రమంగా 3 డిగ్రీల మేర పెరుగుతాయని పేర్కొంది.
News March 21, 2026
మాకు భయపడి రూ.1.21 లక్షల కోట్ల వార్షిప్ పారిపోయింది: IRGC

తమ దెబ్బకు భయపడి అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ‘గెరాల్డ్’ యుద్ధక్షేత్రం నుంచి వెనక్కి వెళ్లిపోయిందని ఇరాన్ IRGC అధికార ప్రతినిధి తెలిపారు. ‘కేవలం వేల డాలర్ల విలువైన మా స్పీడ్ బోట్లకు 13 బిలియన్ డాలర్ల (రూ.1.21 లక్షల కోట్లు) విలువైన వార్షిప్ ఎందుకు భయపడింది? మీరు పేపర్ టైగర్లు మాత్రమే. మా వీరుల పోరాటానికి మీ దగ్గర సమాధానం లేదు. మీరు ఓడిపోయారు. విజయం మాదే’ అని స్పష్టం చేశారు.
News March 20, 2026
ధురంధర్-2తో బాక్సాఫీసు షేక్.. రికార్డులు బ్రేక్!

ధురంధర్-2 బాక్సాఫీసు వద్ద రికార్డులు బద్దలు కొడుతోంది. మొదటిరోజే ₹102.55కోట్ల నెట్ సాధించిన ఈ చిత్రం ఒక్క హిందీ వర్షన్తోనే ₹99.10Cr రాబట్టింది. బాలీవుడ్ సినిమాల్లో ఇదే అత్యధికం. ప్రపంచవ్యాప్తంగా పుష్ప-2 (₹275.2కోట్లు) తర్వాత బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన రెండో భారతీయ సినిమాగా ధురంధర్-2 (₹236.63Cr) నిలిచింది. పెయిడ్ ప్రివ్యూల్లో OG (₹25కోట్లు)ని బీట్ చేసి ₹43కోట్లు వసూలు చేసింది.


