News March 29, 2024

పాడేరులో సీనియర్లను కాదని..

image

AP: అల్లూరి జిల్లా పాడేరులో సీనియర్ నేతలను కాదని కిల్లు వెంకటరమేశ్‌కి టీడీపీ టికెట్ ఇచ్చింది. ఆయన పాడేరు మాజీ సర్పంచ్ వెంకటరత్నం కుమారుడు. టీచర్‌గా రాజీనామా చేసి ఇటీవల TDPలో చేరారు. ఈ సీటు కోసం Ex MLA గిడ్డి ఈశ్వరి, మాజీ మంత్రి మణికుమారి, ZP మాజీ ఛైర్‌పర్సన్ కాంతమ్మ, నాగరాజు ప్రయత్నించారు. కాగా ఇక్కడ చివరిగా 1999లో టీడీపీ గెలిచింది. మరి కొత్త అభ్యర్థి రాకతో ఇక్కడ TDP జెండా ఎగురుతుందేమో చూడాలి.

Similar News

News January 28, 2026

బడ్జెట్ సమావేశాల డేట్ ఫిక్స్

image

AP: రాష్ట్ర బడ్జెట్ సమావేశాల డేట్ ఫిక్సయింది. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ నెల 14న ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అదే రోజు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెెెెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు. మార్చి 12 వరకు సమావేశాలు కొనసాగే ఆస్కారముంది.

News January 28, 2026

అనేక ప్రశ్నల్ని మిగిల్చిన అజిత్ ఆకస్మిక మృతి

image

అజిత్ పవార్ ఆకస్మిక మృతి MH రాజకీయాల్లో పలు ప్రశ్నలను మిగిల్చింది. 2023లో అజిత్ శరద్ పవార్ NCPని వీడి 41 మంది MLAలతో ప్రభుత్వంలో చేరారు. తాజాగా MNP ఎలక్షన్లో శరద్‌తో కలిశారు. 2 వర్గాలు విలీనం కావొచ్చన్న క్రమంలో ఆయన మరణం దాన్ని సందిగ్ధంలోకి నెట్టింది. అటు విలీనమైతే అజిత్ వారసుల పరిస్థితేమిటి? కాకుంటే అజిత్ వర్గానికి నేతృత్వం వహించేదెవరు? అనే ప్రశ్నలూ ఉన్నాయి. GOVTలో కొనసాగితే Dy CM ఎవరనేదీ తేలాలి.

News January 28, 2026

ఈ 5 చోట్ల నెమలి ఈకలు ఉంచితే..?

image

నెమలి ఈకలు సానుకూల శక్తిని, సంపదను ఆకర్షిస్తాయి. కుబేరుని ఆశీస్సులు అందిస్తాయి. అయితే పూజా మందిరంలో 3-7, బీరువాలో 5 నెమలి ఈకలను ఉంచితే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ప్రధాన ద్వారం వద్ద 7 ఈకలు వేలాడదీయాలంటున్నారు. తద్వారా ప్రతికూల శక్తి తొలగిపోతుందని అంటున్నారు. ఉత్తర దిశలో 11, పిల్లల స్టడీ/పెద్దల వర్క్ టేబుల్‌పై 3 ఈకలను ఉంచితే అష్టైశ్వర్యాలు సొంతమవుతాయని అంటున్నారు.