News March 29, 2024
పాడేరులో సీనియర్లను కాదని..
AP: అల్లూరి జిల్లా పాడేరులో సీనియర్ నేతలను కాదని కిల్లు వెంకటరమేశ్కి టీడీపీ టికెట్ ఇచ్చింది. ఆయన పాడేరు మాజీ సర్పంచ్ వెంకటరత్నం కుమారుడు. టీచర్గా రాజీనామా చేసి ఇటీవల TDPలో చేరారు. ఈ సీటు కోసం Ex MLA గిడ్డి ఈశ్వరి, మాజీ మంత్రి మణికుమారి, ZP మాజీ ఛైర్పర్సన్ కాంతమ్మ, నాగరాజు ప్రయత్నించారు. కాగా ఇక్కడ చివరిగా 1999లో టీడీపీ గెలిచింది. మరి కొత్త అభ్యర్థి రాకతో ఇక్కడ TDP జెండా ఎగురుతుందేమో చూడాలి.
Similar News
News January 25, 2025
టెట్ ఫలితాలు ఎప్పుడంటే?
TG: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) ఫలితాలను ఫిబ్రవరి 5న విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. నిన్న టెట్ ప్రిలిమినరీ ‘కీ’తో పాటు రెస్పాన్స్ షీట్లను రిలీజ్ చేసింది. ఇవాళ్టి నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని పేర్కొంది. కాగా ఈనెల 2 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు జరిగాయి. ఫలితాల విడుదల తర్వాత ఏప్రిల్లో సుమారు 5వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.
News January 25, 2025
మౌనీ అమావాస్య.. 10 కోట్ల మంది వస్తారని అంచనా!
ఈ నెల 29న మౌనీ అమావాస్య సందర్భంగా ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో 10 కోట్ల మంది భక్తులు అమృతస్నానాలు చేస్తారని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం యూపీ ప్రభుత్వం 12 కి.మీ పొడవైన ప్రత్యేక ఘాట్ సిద్ధం చేస్తోంది. ఆ రోజున వీఐపీ జోన్ ఉండదని, ప్రముఖులకు అదనపు ఏర్పాట్లు ఉండవని తెలిపింది. ఫిబ్రవరి 3 (వసంత పంచమి), 12 (మాఘ పూర్ణిమ), 26 (మహా శివరాత్రి) తేదీల్లోనూ పెద్దఎత్తున అమృతస్నానాలు చేయనున్నారు.
News January 25, 2025
మీర్పేట ఘటన.. మరిన్ని విషయాలు
TG: మీర్పేటలో భార్యను <<15227723>>చంపి<<>> ఉడికించిన ఘటనకు ముందు భార్యభర్తలు సినిమాకు వెళ్లొచ్చారు. ఆపై ఊరెళ్లే విషయంలో గొడవపడి భార్యను గురుమూర్తి చంపేశాడు. వారి స్వగ్రామమైన ప్రకాశం(D) JPచెరువులో భర్తకు వివాహేతర సంబంధం ఉన్న నేపథ్యంలో గొడవ జరగ్గా, అప్పట్నుంచి ఊరెళ్లడం లేదు. భార్య చనిపోయాక పిల్లలను చూసుకునేందుకు తెలిసిన అమ్మాయైతే(ప్రేయసి) మంచిదనే సెంటిమెంట్తో ఆమెను పెళ్లి చేసుకోవాలని గురుమూర్తి ప్లాన్ వేశాడు.